మాటీవీలో వచ్చే కార్తీకదీపం సీరియల్ అంటే తెలియని వాళ్ళు ఉండరు.. ఈ సీరియల్ కి చాలా మంది
హార్ట్ కోర్ ఫాన్స్ ఉన్నారు. బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘కార్తీకదీపం’ అత్యధిక టీఆర్పీ రేటింగ్ తో ముందుకు సాగుతుంది. మొన్నటివరకు వచ్చిన
బిగ్ బాస్ 3 షో కూడా దానిని బీట్ చేయలేకపోయింది. అయితే ఈ సీరియల్ లో
దీప కేరక్టర్ అంటే మహిళలకు బాగా ఇష్టమనే చెప్పవచ్చు.
కార్తీక్,
దీప దాంపత్య జీవితంలో చోటుచేసుకున్న సంఘటనల ఆధారంగా తీసిన ఈ సీరియల్ తెలుగులో దాదాపు మూడేళ్లుగా నడుస్తోంది.
ఇక ఈ సీరియల్ లో వంటలక్క అలియాస్ దీపకు ఎంత పేరైతే వచ్చిందో దాదాపు అంతే పేరు నిరుపమ్ సైతం సొంతం చేసుకున్నాడు. స్మాల్ స్క్రీన్ శోభన్ బాబుగా నిరుపమ్ను ఇండస్ట్రీలో కీర్తించడం గమనార్హం. అయితే ఈ సీరియర్ ఓ ట్రెండ్ సెట్టర్ అనే చెప్పవచ్చు. ఈ సీరియల్ దెబ్బతో మిగితా చానెల్స్ వారికి పోటీ పెరిగిందంటే అతిశయోక్తి కాదు.
సినిమా హీరోలను మించి అభిమానం ఈ సీరియల్ కేరక్టర్లకు ఉంది. అయితే తాజాగా కార్తీక దీపం సీరియల్ మొదటి సీజన్ పూర్తి కావొచ్చింది. అంతేకాదు పెద్ద సినిమాలు, రియాలిటీ షోలను సైతం తోసిరాజని రేటింగ్స్ లో కూడా టాప్ లో నిలిచింది.
ఈ గుడ్ న్యూస్ను పురస్కరించుకొని
దీప యూనిట్ మొత్తానికి పార్టీ ఇచ్చిందని బుల్లితెర ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ పార్టీకి యూనిట్ మొత్తం హాజరైంది. కాగా, తెలుగు
కన్నా ముందే ఈ సీరియల్ మళయాలంలో కారుముత్తు పేరిట ప్రసారమై 7 సంవత్సరాలు నిరాఘాటంగా సాగి ముగిసింది. ఆ సీరియల్ లో సైతం లీడ్ కేరక్టర్ పోషించింది ప్రేమి విశ్వనాథ్యే కావడం విశేషం.
వంటలక్క కేరక్టర్ లో ఒదిగిపోయిన ప్రేమి విశ్వనాథ్ పెద్దగా గ్లామరస్ కాకపోయినప్పటికీ ఆమెకు మహిళా ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. ముఖ్యంగా మహిళా ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్న కార్తీకదీపం సీరియల్ను పురుషుల్లో సైతం భారీ ఎత్తున అభిమానులున్నారు. ఇక సోషల్ మీడియాలో సైతం ఈ సీరియల్ గురించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది.