బాహుబలి వంటి భారీ విజయం తర్వాత ప్రభాస్ నటించిన సాహో సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైన దారుణంగా ఫ్లాప్ కావడం జరిగింది. దాదాపు సాహో సినిమా కోసం ప్రభాస్ రెండు సంవత్సరాలు టైం కేటాయించి సినిమా విడుదలైన మొదటి షో ఫ్లాప్ టాక్ రావడంతో తీవ్ర నిరుత్సాహానికి సినిమా యూనిట్ మరియు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అదే విధంగా అభిమానులు గురికావడంతో ప్రస్తుతం జిల్ ఫెమ్ డైరెక్టర్ రాధాకృష్ణ దర్శకత్వంలో పాతకాలం నాటి ఒక యదార్థమైన ప్రేమ కథ ఆధారంగా ప్రభాస్ సినిమా చేస్తున్న విషయం మనకందరికీ తెలిసినదే. అయితే ఈ సినిమా కోసం గతంలో రెండు భారీ బడ్జెట్ సినిమా ఫార్ములా..అనగా భారీ భారీ సెట్లు తో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటున్నట్లు ఫిలింనగర్లో వినబడుతున్న టాక్.


భారీ బడ్జెట్ సినిమాలు ఇక చేయకూడదని సాహో సినిమా రిజల్ట్ వచ్చిన తర్వాత డిసైడ్ అయిన ప్రభాస్...ప్రస్తుతం చేస్తున్న లవ్ స్టోరీ సినిమా కథ డిమాండ్ చేయడంతో ఈ సినిమా కోసం దాదాపు 150కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. సినిమా వింటేజ్ బ్యాక్ డ్రాప్ లో ఎక్కువగా నడుస్తుందట. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ ని యూరప్ లో స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇక నవంబర్ 18న సినిమాకు సంబందించిన మరో షెడ్యూల్ ని హైదరాబాద్ లో స్టార్ట్ కాబోతున్నట్లు ఫిలింనగర్లో వినబడుతున్న టాక్.


అంతే కాకుండా రెండు డిఫరెంట్ క్యారెక్టర్ లో ప్రభాస్ సినిమా లో కనిపించనున్నట్లు సమాచారం. మొదట ఈ సినిమా కోసం వంద కోట్ల లోపు లో సినిమా పూర్తి చేయాలని భావించిన నిర్మాతలు ఇప్పుడు కథ డిమాండ్ చేయడంతో దాదాపు బడ్జెట్ 180 కోట్లతో సినిమా నిర్మించనున్నట్లు ఫిల్మ్ నగర్ లో వార్తలు వినబడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ సినిమా కోసం ఒక భారీ సెట్ రైల్వే స్టేషన్ కి సంబంధించినది వేసినట్లు ఇండస్ట్రీ నుండి వస్తున్న సమాచారం. ఈ సినిమాని వచ్చే వేసవికి విడుదల చేయాలని ప్రభాస్ భావిస్తున్నాడట. త్వరలోనే రెండో షెడ్యూల్ మొదలు పెట్టనున్న సినిమా యూనిట్ ఏకధాటిగా సినిమా షూటింగ్ చేయడానికి రెడీ అయినట్లు సమాచారం.



మరింత సమాచారం తెలుసుకోండి: