ఈరోజే కోలీవుడ్ కు చెందిన ఇద్దరు స్టార్ హీరోల చిత్రాలు విడుదల అయ్యాయి.ఒకటి మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటించిన విజయ్ సేతుపతి అయితే మరొకటి విజయ్ కంటే ముందు నుంచి తెలుగు ప్రేక్షకులకు మరింత సుపరిచితం అయిన విశాల్ న‌టించిన యాక్ష‌న్‌. తెలుగు వాడు అయినా కోలీవుడ్‌లో హీరోగా స్థిర‌ప‌డి అటు త‌మిళ్‌తో పాటు ఇటు తెలుగు హీరోల‌ను మెప్పిస్తున్న విశాల్ హీరోగా తమన్నా మరియు ఐశ్వర్య లక్ష్మిలు హీరోయిన్లుగా సుందర్ సి దర్శకత్వంలో యాక్ష‌న్ చిత్రం తెర‌కెక్కింది.


కొద్ది రోజులుగా విశాల్ న‌టించిన సినిమాలు అన్ని వ‌రుస పెట్టి హిట్ అవుతున్నాయి. రాయుడు, డిటెక్టివ్‌, అభిమ‌న్యుడు, పందెంకోడి 2 వ‌రుస హిట్ల‌తో విశాల్ మంచి జోష్లో ఉన్నాడు. ఇక విశాల్ కెరీర్‌లోనే భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన యాక్ష‌న్ టీజ‌ర్లు, ట్రైల‌ర్ల‌తోనే చంపేసింది. రు. 50 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో సుంద‌ర్ సి ఈ సినిమాను ప్ర‌జెంట్ చేశాడు. భారీ అంచ‌నాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన యాక్ష‌న్‌కు ఇప్ప‌టికే చాలా చోట్ల పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అవుతోంది.


యాక్ష‌న్‌ ఫస్టాఫ్ ముగిసే సరికి ఎక్కడా కూడా ప్రేక్షకులను నిరుత్సాహ పరచకుండా ఆసక్తికరంగానే కొనసాగింది అని చెప్పాలి. ఫ‌స్టాఫ్‌లో మెయిన్ స్టోరీ లోకి వెళ్ల‌క‌పోయినా ద‌ర్శ‌కుడు సుంద‌ర్. సి సినిమాను తెరకెక్కించిన తీరు బాగుందంటున్నారు. ఇంకా చెప్పాలంటే ఈ ట్రీట్ మెంట్ త‌ప్ప‌కుండా తెలుగు ప్రేక్షకులను థ్రిల్ చేసేలా ఉందంటున్నారు.


ముఖ్యంగా యాక్షన్ చిత్రాలను ఇష్టపడే వారికి ఈ “యాక్షన్” మరింత నచ్చుతుంది. మొదటి ఫ్రేమ్ నుంచి కూడా ప్రతీ యాక్షన్ సీన్ వరకు విజువల్స్ పరంగా యాక్ష‌న్ దుమ్ము లేపేసింద‌న్న టాక్ వ‌చ్చేసింది. ఇక సెకండాఫ్ కంప్లీట్ అయ్యి టోట‌ల్ రిజ‌ల్ట్ కోసం వెయిటింగ్ మాత్ర‌మే మిగిలి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: