కత్తి అందుకో జానకి.. నాయల్ది ఎసేస్తాను... అన్న డైలాగు ఇప్పటికీ 
వినపడుతుంది... అలాంటి ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించిన హీరో అంటే గుర్తొచ్చేది సీనియర్ నటుడు కృష్ణంరాజు....సినిమాలలో తన మార్క్ మరియు స్టయిల్ ఎలా ఉంటుందో  అంతకు మించిన మంచి మనసు ఆయనది...ఇది ఇలా ఉండగా కొన్ని కారణాల వల్ల ఆయన ప్రస్తుతం ఆసుపత్రిలో చేరాడు. 


తెలుగు సీనియర్ నటుడు కృష్ణం రాజు గత కొంతకాలంగా న్యుమోనియాతో భాదపడుతున్న సంగతి తెలిసిందే . కాగా, బుధవారం రాత్రి నుండి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో దగ్గరలోని కేర్ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి కాస్త విషమంగానే ఉందని డాక్టర్లు వెల్లడించారు. ప్రత్యేక వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో జాన్ షూటింగ్ లో బిజీగా ఉన్న ప్రభాస్ వెంటనే కేర్ హాస్పిటల్ కు చేరుకున్నాడు. తాజాగా వైద్యులు వెల్లడించిన సమాచారం ప్రకారం ఆయన ఆరోగ్య పరిస్థితి కొంచం మెరుగుపడిందని, అబ్జర్వేషన్ లో ఉంచారని కుటుంబీకులు వెల్లడించారు. త్వరలోనే ఆయన కోలుకోవాలని కుటుంబ సభ్యులు, సినీ అభిమానులు కోరుకుంటున్నారు. 


అందడంలేదని గత బుధవారం నుండి ఆసుపత్రిలో చేరారు. దగరలో కేర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఇది ఇలా ఉండగా ఈ విషయం పై స్పందించిన కృష్ణం రాజు అస్వస్థతో వచ్చానని ఆసుపత్రిలో చేరాను అంతేగాని నేను పోలేదు.. బ్రతికే ఉన్నాను.. వ్యూస్ రావాలని మీ ఇష్టమొచ్చినట్లు మాత్రం చేయకండి అంటూ మీడియా పై, నెటిజన్లపై అయన మండిపడ్డారు. బ్రతికున్న వాళ్ళను చంపకండి అంటూ ఆయన హెచ్చరించారు.సమాజంలో సెలెబ్రెటీలు అంటే పిచోళ్లు కాదు. వారికి పరువుకు మర్యాదలకు భంగం కలిగించకండి..

మరింత సమాచారం తెలుసుకోండి: