యంగ్
హీరో నితిన్ పర్ ఫెక్ట్ గా ప్లాన్ చేస్తున్నాడు. ఎప్పుడు లేని విధంగా ఈ యంగ్
హీరో వరుసగా సినిమాలను లైన్ లో పెట్టాడు. ఫ్లాప్ దర్శకులు, హిట్ దర్శకులు అనే తేడా లేకుండా
నితిన్ కథకే ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. ప్రస్తుతం
నితిన్ చేస్తున్న సినిమాల లైనప్ చూస్తే ఇదే విషయం క్లియర్ గా వినిపిస్తోంది.
శ్రీనివాస కళ్యాణం డిజాస్టర్ తో
నితిన్ ఏడాది పాటు మరో
సినిమా ఒప్పుకోలేదు. అయితే ఆ గ్యాప్ లో
నితిన్ ఖాళీగా ఉన్నాడేమో అనుకుంటే వరుస కథలు విన్నాడని ఇప్పుడు అర్థమవుతోంది. ఏడాది పాటు కథలు విన్న ఈ యంగ్
హీరో ఇప్పుడు వరుసగా సినిమాలకు సైన్ చేస్తున్నాడు. ప్రస్తుతం
వెంకీ కుడుముల దర్శకత్వంలో భీష్మ
సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యే రిలీజైన ఫస్ట్ గ్లిబ్
ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసింది.
రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ
సినిమా అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోంది.
భీష్మ
సినిమా తర్వాత
నితిన్,
చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ఓ సినిమాను
వెంకీ అట్లూరి దర్శకత్వంలో రంగ్ దే అనే మరో సినిమాను సెట్స్ పైకి ఎక్కించేందుకు పక్కా ప్లానింగ్ చేసుకున్నాడు. ఈ రెండు సినిమాలతో పాటు మరో
బాలీవుడ్ రిమేక్ కు కూడా
నితిన్ పచ్చజెండా ఊపినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం భీష్మ షూటింగ్ ఫినిషింగ్ స్టేజ్ చేరుకుంది. ఈ సినిమాను వచ్చే నెలలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.