సాధారణంగా ఇండస్ట్రీలో పెద్దగా అవకాశాలు రాని హీరోయాన్స్ వెబ్ సిరీస్ లో నటిస్తూ ఉంటారు. అయితే దీనికి భిన్నంగా సాయి పల్లవి డిజిటల్
మీడియా వైపు అడుగులు వేయడం హాట్ న్యూస్ గా మారింది. నెట్ ఫ్లిక్స్ కు సంబంధించిన ఒక వెబ్ సిరీస్ ను ఆమె ఒప్పుకున్నట్టు ప్రచారం జరుగుతోంది.
తెలుస్తున్న సమాచారం మేరకు
తమిళ దర్శకుడు
వెట్రిమారన్ ఈ వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహించబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ వెబ్ సిరీస్ లో
ప్రకాష్ రాజ్ కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నాడని టాక్. లేటెస్ట్ గా
వెట్రిమారన్ ధనుష్ తో తీసిన ‘అసురన్’ మూవీతో సంచలన దర్శకుడుగా మారాడు.
ఈ వెబ్ సిరీస్ కు
వెట్రిమారన్ కాకుండా మరో ముగ్గురు దర్శకులు కూడా పని చేస్తున్నారు. సుధా కొంగర విగ్నేష్ శివన్
గౌతమ్ మీనన్ లాంటి ప్రముఖ దర్శకులు ఈ ప్రాజెక్ట్ లో ఇన్వాల్వ్ కావడంతో ఈ ప్రాజెక్ట్ ప్రారంభం కాకుండానే దీని పై క్రేజ్ పెరిగి పోయింది. ప్రస్తుతం సాయి పల్లవి ప్రస్తుతం తెలుగులో నటిస్తున్న ‘విరాటపర్వం’
శేఖర్ కమ్ముల నాగచైతన్యల ‘లవ్ స్టోరీ’ తరువాత ఈ వెబ్ సిరీస్ షూటింగ్ వేగం పుంజుకుంటుంది అని అంటున్నారు.
బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వాని లా ఒకవైపు సినిమాలు చేస్తూ మరొక వైపు వెబ్ సిరీస్ ల వైపు సాయి పల్లవి అడుగులు వేయడం ఆమె ముందు చూపును సూచిస్తోంది..