బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా.. బాలీవుడ్లో, హాలీవుడ్‌లో సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉన్నారు. ఆమె నిక్ జోనస్ ను పెళ్లి చేసుకున్న తర్వాత కొత్త ఇంటికోసం రూ. 144 కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ జంట ఇప్పటివరకు లాస్‌ఏంజెలెస్‌లోని బెవెర్లీ హిల్స్‌లో ఉన్న నిక్‌ నివాసంలో ఉంటున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఇంటిని అమ్మేసి కొత్త ఇల్లు కొనుక్కోవాలనుకున్నారు.


ఈ నేపథ్యంలో లాస్‌ఏంజెలెస్‌లోని ఎన్సివో ప్రాంతంలోని విలాసవంతమైన ఓ ఇల్లును ప్రియాంక, నిక్‌ జంట కొనుగోలు చేసినట్లు సమాచారం. 20 వేల చదరపు అడుగులు ఉన్న ఈ ఇంటి ఖరీదు దాదాపుగా రూ.144 కోట్లు(20 మిలియన్లు). అలానే నూతన భవనం కోసం నిక్ ఆగస్టులో తన బ్యాచిలర్ పాడ్ ను అమ్మేశాడని వార్తలు వచ్చాయి. ఇక కొత్త ఇంటిని కొనుగోలు చేయడంతో.. లాస్‌ఏంజెలెస్‌లో స్థానిక రియల్‌ ఎస్టేట్‌ రికార్డులను ఈ జంట బద్దలు కొట్టినట్లు తెలుస్తోంది.


ఇక ఈ ఇంట్లో ఏడు బెడ్‌ రూమ్‌లు, 11 బాత్‌రూమ్‌లు ఉన్నాయట. అలానే ఇంటి ముందు విశాలమైన స్థలం ఉన్నట్లు తెలుస్తోంది. అలానే నిక్ సోదరుడు జో జోనస్‌ అతడి భార్య సోఫియో టర్నర్‌ నిక్‌ ఇంటికి మూడు కిలోమీటర్ల దూరంలో రూ. 101 కోట్లు(14.1మిలియన్లు ) ఖర్చు పెట్టి కొత్త ఇంటిని కొన్నట్లు తెలుస్తోంది. ఇక ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియాంక మాట్లాడూతూ.. ’కొత్త ఇల్లు కొనుక్కోవడం.. పిల్లలను కనడం నాలిస్టులో ఉన్న విషయాలు. రాబోయే పదేళ్లలో పిల్లలను కంటాను. పిల్లలంటే నాకు ఎంతో ఇష్టం” అని చెప్పింది. నిక్ జోనాస్‌తో వివాహానంతరం.. బాలీవుడ్ చిత్రాలను తగ్గించిన ప్రియాంక రీసెంట్‌గా స్కై ఈజ్ పింక్‌తో మంచి విజయాన్ని అందుకుంది. అయినా ఇక్కడి చిత్రాలకు మాత్రం అంత ఈజీగా ఓకే చెప్పడం లేదు. ప్రస్తుతం ప్రియాంక చేతిలో ఓ హాలీవుడ్ చిత్రం, ఓ వెబ్ సిరీస్‌కు సంబంధించిన ప్రాజెక్ట్‌లు ఉన్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: