కోలీవుడ్ యంగ్ హీరో కార్తీ ఇటీవల లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఖైదీ సినిమా సూపర్ హిట్ తో మంచి జోష్ మీదున్నాడు. వాస్తవానికి గత కొద్దికాలంగా కార్తీ చేస్తున్న సినిమాలు పెద్దగా సక్సెస్ కాకపోవడంతో ఆయన ఎంతో అలోచించి ఖైదీ కథను ఎంచుకున్నారు. వాస్తవిక ఘటనలతో సహజత్వానికి దగ్గరగా, కథ మరియు కథనాలే ప్రధాన బలంగా తెరకెక్కిన ఆ సినిమాకు తెలుగు, తమిళ ప్రేక్షకులు మంచి విజయాన్ని మరియు కలెక్షన్ ని అందించడం జరిగింది. పూర్తిగా నైట్ ఎఫెక్ట్ లో చిత్రీకరించబడ్డ ఆ సినిమాలో కార్తీకి హీరోయిన్ లేదు, అలానే సాంగ్స్ కూడా లేకపోవడం విశేషం. కాగా ఈ సినిమాకు అతి త్వరలో సీక్వెల్ కూడా రాబోతున్నట్లు ఇటీవల హీరో కార్తీ తెల్పడం జరిగింది. 

ఇకపోతే దీని తరువాత కార్తీ, జ్యోతిక ప్రధాన పాత్రల్లో జీతూ జోసెఫ్ దర్శకత్వంలో తెరెక్కుతున్న తాజా సినిమాకు 'దొంగ' అనే టైటిల్ ని నిర్ణయించి కాసేపటి క్రితం దాని ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసింది సినిమా యూనిట్. ఈ పోస్టర్ ని కార్తీ సోదరుడు సూర్య తన అఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా రిలీజ్ చేయడం జరిగింది. ఈ సినిమాలో కార్తీ మరియు జ్యోతిక అక్క, తమ్ముళ్లుగా నటిస్తున్నట్లు సమాచారం. ఆర్ డి రాజశేఖర్ ఫోటోగ్రఫిని, 

గోవింద్ వసంత సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాను వయాకామ్ 18 స్టూడియోస్ సమర్పణలో ప్యారలెల్ మైండ్ ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తోంది. ఎంతో భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను ఆకట్టుకునే థ్రిల్లింగ్ యాక్షన్ సీన్స్ తో దర్శకుడు జోసెఫ్ తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ప్రముఖ నటుడు సత్యరాజ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ నెలాఖరులో రిలీజ్ చేసే అవకాశం కనపడుతోంది. ఓవైపు కార్తీ వదిన జ్యోతిక కూడా ఇటీవల తమిళంలో వరుస విజయాలతో దూసుకుపోతుండడంతో వీరిద్దరి కాంబోలో రాబోతున్న ఈ సినిమాపై కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి....!!


మరింత సమాచారం తెలుసుకోండి: