మాస్ మహారాజ
రవితేజ నటిస్తున్న 'డిస్కోరాజా' అలాగే స్వీటి
అనుష్క శెట్టి నటిస్తున్న 'నిశబ్దం' సినిమాలు
2020 సంక్రాంతి సీజన్ తర్వాత
జనవరి నాలుగో వారంలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతున్న విషయం తెల్సిందే. ఈ రెండు సినిమాలు కూడా భారీ అంచనాలను క్రియోట్ చేసి ఉన్న సంగతి తెలిసిందే. రెండు సినిమాలు ఒకేసారి రావడం వల్ల రెండింటికి కూడా నష్టం జరుగుతుందేమో అనే అనుమానాలు ఇప్పటికే వ్యక్తం అవుతున్నాయి. అందుకనే ఈ రెండు సినిమాల మద్య కనీసం 2-3 రోజుల గ్యాప్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారట.
జనవరి చివరి వారం కోసం ఈ రెండు సినిమాలు పోటీ పడుతున్న సమయంలో అనూహ్యంగా
తమిళ స్టార్
హీరో సూర్య ఈ ఇద్దరికి గట్టి షాకిచ్చాడు. తన సినిమాని కూడా అదే వారంలో విడుదల చేయబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
సుధ కొంగర దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'సూరరై పొత్రు'ను
జనవరి చివరి వారంలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని
కోలీవుడ్ మీడియా సమాచారం. తెలుగులో కూడా ఈ సినిమాను భారీగా విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇటీవలే ఫస్ట్ లుక్ విడుదల చేయగా సూర్య అభిమానులు ఈ సినిమాపై భారీ అంచనాలను పెట్టుకున్నారు.
ఎయిర్ డెక్కన్ ఫౌండర్.. కెప్టెన్ జీఆర్ గోపీనాథ్ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఆధారం గా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారట. ఆసక్తి కర అంశాలతో పాటు ఎంటర్ టైన్ మెంట్ కూడా ఈ సినిమాలో కావాల్సినంత ఉంటుందంటూ చిత్ర యూనిట్ ప్రచారం చేస్తున్నారు. ఇక
సినిమా ఖచ్చితం గా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకంతో కూడా ఉన్నారు. సూర్య కు తెలుగులో మంచి
మార్కెట్ ఉంది. కాబట్టి
రవితేజ, అనుష్కల తో పోటీ పడటం వల్ల అందరు నష్టపోయే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. నిజమే కదా..అసలే అటు సూర్య కి ఇటు
రవితేజ కి హిట్ తప్పనిసరి. మరి ఈ పోటీ అవసరమా అని కొందరు చెప్పుకుంటున్నారు.