నిన్నటికి నిన్న సినీ నటుడు డా.రాజశేఖర్ రోడ్డు  ప్రమాదానికి గురయ్యాడు. ఈ యాక్సిడెంట్ లో ఆయన కారు నుజ్జు నుజ్జైంది. కాకపోతే ఆయన మాత్రం సేఫ్ గా బయట పడ్డారు. ఆయనకి ఇలా యాక్సిడెంట్ జరిగిందని తెలిసిన వెంటనే అభిమానులు, సినీ వర్గాలు, మీడియా జనాలు చాలా మందే రియాక్టయ్యారు. ఆయనకి ఎలా ఉందని ఆందోళన చెందారు. అయితే చిన్న గాయం కూడా కాకుండా మీడియా ముందుకు వచ్చి నేను బాగానే ఉన్నానని తన మీద చూపించిన అభిమానానికి కృతజ్ఞతలు కూడా తెలిపాడు. అలానే తన గురించి అసలు పట్టించుకోని వాళ్ళ మీద కూడా కాస్త ఫైర్ అయ్యాడు. ఇక ఇలాంటి ఇన్సిడెంటే మరోటి జరిగింది. అయితే ఈ ప్రమాదంలో పాపులర్ సింగర్ ప్రాణాలను కోల్పోయింది.   

వాస్తవంగా ఇటీవల అంతకంతకూ పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల కారణంగా ఏటా లక్షలాది మంది మరణిస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో ఎక్కువగా సినిమా వాళ్ళు కూడా రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. తాజాగా చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఒక ప్రముఖ సింగర్ మరణించారు. మరాఠీ ప్లేబ్యాక్ సింగర్ గీతామాలీ రోడ్డు ప్రమాదంలో మరణించడం అందరికి షాకిచ్చింది. ముంబయి- ఆగ్రా హైవేపైన ఈ శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో గీతామాలీ మరణించారు.

పలు మరాఠీ సినిమాలతో పాటు.. హిందీ సినిమాల్లోనూ గీతామాలీ పాటలు పాడారు. ఇటీవల అమెరికా నుంచి వచ్చిన గీతామాలీ.. తమ సొంతూరైన నాసిక్ కు కారులో వెళుతున్నప్పుడు ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు పక్కన నిలిపి ఉన్న ట్యాంకర్ ను వేగంగా వెళ్ళిన కారు ఢీ కొట్టటంతో ఆమె మరణించారు. తన మరణానికి అతివేగమేనని సమాచారం. ఇక ఈ కారులో గీతా తో పాటు ఆమె భర్త కూడా ఉన్నారు. తీవ్ర గాయాల బారిన పడిన అతన్ని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్సను అందిస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన గీతా మాలీని ఆసుపత్రిలో చేర్చగా.. అక్కడ చికిత్స పొందుతూ మరణించారు. ఆమె మరణం పట్ల పలువురు మరాఠీ ఇండస్ట్రీ ప్రముఖులు దిగ్భాంత్రిని వ్యక్తం చేశారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: