ఇక ఆయన నటించబోయే తదుపరి
సినిమా విషయమై ఇటీవల ఒక ప్రకటన కూడా వచ్చింది.
బాలీవుడ్ నటుడు
అమితాబ్ ఇటీవల నటించిన
పింక్ మూవీ రీమేక్ లో
పవన్ నటించబోతున్నారని, అలానే దానికి
యువ దర్శకుడు వేణు
శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా, దిల్ రాజు మరియు
బోనీ కపూర్ నిర్మాతలుగా వ్యవహరిస్తారు అని ప్రకటన వచ్చింది. ఇక గత కొద్దిరోజులుగా ఈ సినిమాకు సంబంధించి మిగతా క్యాస్టింగ్ కోసం నటీనటుల ఎంపిక జరుగుతున్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి.
అయితే నేడు కొన్ని
టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం,
పవన్ నటించబోయే ఆ సినిమా ఆగిపోయినట్లు చెప్తున్నారు. అయితే ఆ
సినిమా పూర్తిగా ఆగిపోలేదని, కాకపోతే దానిని ప్రస్తుతానికి ప్రక్కన పెట్టి, ముందుగా
క్రిష్ డైరెక్షన్ లో
పవన్ ఒక
సినిమా చేస్తారని, ఆ తరువాతనే
పింక్ రీమేక్ లో నటిస్తారని అంటున్నారు. ఇటీవల
క్రిష్ తనకు చెప్పిన కథ ఎంతో బాగా నచ్చడంతో
పవన్ ముందుగా ఆ
సినిమా చేయడానికి సిద్ధం అయినట్లు చెప్తున్నారు. కాగా నేడు పలు సోషల్
మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్న ఈ వార్త పై అధికారిక ప్రకటన మాత్రం వెలువడాల్సి ఉంది.....!!