టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన భారీ ప్రతిష్టాత్మక సినిమా అజ్ఞాతవాసి గత ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి, పవన్ ఫ్యాన్స్ మరియు ప్రేక్షకుల అంచనాలు అందుకోలేక టాలీవుడ్ అతి పెద్ద డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఇక ఆ తరువాత తన జనసేన పార్టీ కార్యకలాపాలలో పూర్తిగా నిమగ్నమైన పవన్, ఇకపై సినిమాల్లో నటించేది లేదని తేల్చి చెప్పడం జరిగింది. అయితే అజ్ఞాతవాసి ఫ్లాప్ అవడంతో ఆయన ఫ్యాన్స్ ఎంతో ఢీలా పడ్డారు. తమ కోసం పవన్ కళ్యాణ్ గారు ఒక్క మంచి సినిమా చేస్తే చాలు అని వారు ఆశపడుతుండడం, అలానే పలు మార్లు ఈ విషయమై ఆయనకు విజ్ఞప్తులు చేస్తుండడంతో ఎట్టకేలకు పవర్ స్టార్, ఫ్యాన్స్ కోసం సినిమాలు చేయడానికి అంగీకరించారు. 

ఇక ఆయన నటించబోయే తదుపరి సినిమా విషయమై ఇటీవల ఒక ప్రకటన కూడా వచ్చింది. బాలీవుడ్ నటుడు అమితాబ్ ఇటీవల నటించిన పింక్ మూవీ రీమేక్ లో పవన్ నటించబోతున్నారని, అలానే దానికి యువ దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా, దిల్ రాజు మరియు బోనీ కపూర్ నిర్మాతలుగా వ్యవహరిస్తారు అని ప్రకటన వచ్చింది. ఇక గత కొద్దిరోజులుగా ఈ సినిమాకు సంబంధించి మిగతా క్యాస్టింగ్ కోసం నటీనటుల ఎంపిక జరుగుతున్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి. 

అయితే నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, పవన్ నటించబోయే ఆ సినిమా ఆగిపోయినట్లు చెప్తున్నారు. అయితే ఆ సినిమా పూర్తిగా ఆగిపోలేదని, కాకపోతే దానిని ప్రస్తుతానికి ప్రక్కన పెట్టి, ముందుగా క్రిష్ డైరెక్షన్ లో పవన్ ఒక సినిమా చేస్తారని, ఆ తరువాతనే పింక్ రీమేక్ లో నటిస్తారని అంటున్నారు. ఇటీవల క్రిష్ తనకు చెప్పిన కథ ఎంతో బాగా నచ్చడంతో పవన్ ముందుగా ఆ సినిమా చేయడానికి సిద్ధం అయినట్లు చెప్తున్నారు. కాగా నేడు పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్న ఈ వార్త పై అధికారిక ప్రకటన మాత్రం వెలువడాల్సి ఉంది.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: