సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస విజయాలతో టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నారు. అంతే కాకుండా తన అభిమానులు కాలర్ ఎగరేసలా సినిమాలు చేస్తూ ఎంతగానో అలరిస్తున్నారు. భరత్ అనే నేను, మహర్షి లాంటి సినిమాలతో రెండు అదిరిపోయే సూపర్ బ్లాక్ బాస్టర్ హిట్లు అందుకున్న మహేష్ బాబు హ్యాట్రిక్ కొట్టాలని డిసైడ్ అయ్యి అనిల్ రావిపూడి దర్శకత్వం లో సరిలేరు నీకెవ్వరు సినిమా షూటింగ్ స్టార్ట్ చేసి చాలా శరవేగంగా సినిమాని కంప్లీట్ చేయడానికి సిద్ధమవుతున్నారు. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా కచ్చితంగా రాబోయే సంక్రాంతి బ్లాక్ బస్టర్ విజయం సాధించాలి అని మహేష్ డిసైడ్ అయినట్లు ఫిలింనగర్లో వినబడుతున్న టాక్.


ఇదిలా ఉండగా ఈ సినిమాకి సంబంధించి కొత్త కొత్త విషయాలు ఎప్పటికప్పుడు అభిమానులకు తెలియజేస్తున్న సినిమా టీం ఇటీవల సినిమాకి సంబంధించిన టీజర్ విషయంలో ఎలాంటి సమాచారాన్ని కూడా ప్రస్తుతం ఇవ్వకపోవడంపై అభిమానులు కొంత నిరుత్సాహం లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటువంటి నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకి సంబంధించిన టీజర్ విషయంలో ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.సమయం ఎలాగో దగ్గర పడుతుంది కాబట్టి ముందుగా టీజర్ నే విడుదల చెయ్యడానికి యూనిట్ సిద్ధం అయ్యినట్టు సమాచారం.


వచ్చే వారంలోనే తాము టీజర్ ఎప్పుడు విడుదల చేస్తారో అన్న దానికి సంబంధించిన అప్డేట్ ను విడుదల చేస్తారని సమాచారం.మరి వచ్చే వారం నిజంగానే టీజర్ పై ఏదన్నా అప్డేట్ ఉంటుందో లేదో చూడాలి. ఈ సినిమాలో మహేష్ బాబు పక్కన హీరోయిన్ గా రష్మిక మందన నటిస్తోంది. అంతేకాకుండా సీనియర్ హీరోయిన్ లేడీ అమితాబ్ బచ్చన్ గా పేరొందిన విజయశాంతిసినిమా తో రీ ఎంట్రీ ఇవ్వడం తో సినిమాపై అంచనాలు విపరీతంగా మహేష్ ఫ్యాన్స్ పెట్టుకున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: