బుల్లితెర
కామెడీ షో
జబర్దస్త్ కు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మల్లెమాల నిర్మాణంలో
జబర్దస్త్ కామెడీ షో ఐదారేళ్ల నుండి
సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఈ షో ద్వారా కమెడియన్స్ తో పాటుగా జడ్జులుగా చేసిన నాగబాబు, రోజాలకు కూడా మంచి పేరు వచ్చింది.
బుల్లితెర మీద హయ్యెస్ట్ రేటింగ్ కలిగిన
జబర్దస్త్ షో కేవలం టెలికాస్ట్ టైంలోనే కాదు
యూట్యూబ్ లో కూడా సంచలనం సృష్టిస్తుంది. అయితే లేటెస్ట్ గా
జబర్దస్త్ షో నుండి మెగా బ్రదర్ నాగబాబు బయటకు వెళ్తున్నాడన్న వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.
జబర్దస్త్ డైరక్టర్స్ ఇద్దరిని మల్లెమాల వాళ్లు తీసేయడం వల్ల వారికి సపోర్ట్ గా నాగబాబు నిలవడం వారు ఉంటేనే తాను ఉంటానని చెప్పి నాగబాబు కూడా
జబర్దస్త్ షోకి బ్రేక్ ఇవ్వడం జరిగిందట.
అయితే వెళ్లిపోయిన ఇద్దరు డైరక్టర్స్ వేరే ఛానెల్ ఫ్యాన్సీ ఆఫర్ ఇవ్వడంతో అటు వెళ్లారట. అంతేకాదు వారితో పాటుగా ప్రస్తుతం జబరస్త్ లో ఉన్న కొంతమందిని తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నారట. ముఖ్యంగా
జబర్దస్త్ షో ద్వారా బాగా పాపులర్ అయిన హైపర్
ఆది, సుడిగాలి సుధీర్, చమ్మక్ చంద్రలు షో విడిచి వెళ్తారని తెలుస్తుంది.
నాగబాబు వెళ్తే ఏమో అనుకోవచ్చు కాని
ఆది, సుధీర్, చంద్ర వెళ్తే మాత్రం
జబర్దస్త్ కు బాగా ఎఫెక్ట్ పడుతుంది. ఈ షో ద్వారానే తమకు మంచి గుర్తింపు వచ్చిందని భావిస్తున్న
ఆది, సుధీర్, చంద్రలు మల్లెమాల టీం
కన్నా డైరక్టర్స్ వెంట ఉంటున్నారని తెలుస్తుంది. మరి ఈ గొడవ ఎలా సర్ధుబాటు అవుతుందో చూడాలి. ఒకవేల చర్చలు సఫలం కాకపోతే మాత్రం నాగబాబు ఆయంతో పాటు కొంతమంది టీం లీడర్స్ కూడా
జబర్దస్త్ ఖాళీ చేస్తారని తెలుస్తుంది.