హ్యాట్రిక్ ప్లాపులను పొందిన తరువాత, యువ నటుడు రాజ్ తరుణ్ తన సినీ కెరీర్ పై పూర్తిగా దృష్టి సారించి, తన రాబోయే ప్రాజెక్ట్ గురించి జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రస్తుతం రాజ్ తరుణ్ తన రాబోయే చిత్రం 'ఓర్రే బుజ్జీ' లో బిజీగా ఉన్నాడు, ఇది శర వేగంతో షూటింగ్ జరుపుకొంటోంది మరియు ఈ చిత్ర షూటింగ్ పూర్తయ్యే దశలో ఉంది.
ఈ చిత్రంలో మాలవికా నాయర్ కథానాయికగా నటిస్తోంది. 
తాజా సమాచారం ప్రకారం, రాజ్ తరుణ్ నటించిన ఓరే బుజ్జీ చిత్రంలో హెబ్బా  పటేల్‌ నటిస్తున్నట్లు సమాచారం. వీరిద్దరూ నటించిన కుమారి 21ఎఫ్ సినిమా అప్పట్లో ఒక సంచలనం సృష్టించింది. ఇక ప్లాపుల ఊబిలో కూరుకుపోయిన రాజ్ తరుణ్ ను రక్షించడానికి హెబ్బా పటేల్ ను రంగం లో కి దింపినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం యొక్క ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో హెబ్బా పటేల్ కనపడనున్నట్లు సమాచారం. ఉయ్యల జంపాలా ఫేమ్ నటుడు రాజ్ తరుణ్ నటించిన ఓర్రే బుజ్జీ ఒక మంచి ట్విస్ట్ ఉన్న లవ్ స్టోరీ అని తెలుస్తోంది. అర్జున్ రెడ్డి ఫేమ్ షాలిని పాండే ని మొదట్లో హీరోయిన్ గా తీసుకుందాం అనుకున్నా, తరువాత మేకర్స్ మాల్వికా నాయర్‌ను ఓర్రే బుజ్జీలో కథానాయక గా తీసుకున్నారు. 
రాజ్ తరుణ్ చివరిసారిగా లవర్ సినిమా లో కనిపించాడు, ఇది బాక్సాఫీస్ వద్ద  అపజయం పాలైంది మరియు ఈ రాబోయే చిత్రం ఓర్రే బుజ్జీతో తిరిగి విజయం పొందాలని యోచిస్తున్నారు. ఇక అనుప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. 
అంతకుముందు రాజ్ తరుణ్ మరియు హెబ్బా పటేల్ కలిసి రొమాంటిక్ మరియు బోల్డ్ డ్రామా కుమారి 21 ఎఫ్ కోసం పనిచేశారు, పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించారు మరియు సుకుమార్ రైటింగ్స్ మరియు పిఎ మోషన్ పిక్చర్స్ పతాకాలలో విజయ్ బాంద్రేడ్డి మరియు థామస్ రెడ్డిలతో కలిసి సుకుమార్ కలిసి నిర్మించారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. ఈ చిత్రం అంతా సిద్ధూ, మరియు కుమారి సాగే లవ్ స్టోరీ. ఇప్పుడు మరోసారి కుమారి 21 ఎఫ్ కాంబో రాజ్ తరుణ్ మరియు హెబా పటేల్ రొమాంటిక్ డ్రామా ఓరేయ్ బుజ్జీ కోసం జతకడుతున్నారు. 
 



మరింత సమాచారం తెలుసుకోండి: