వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ... ఈయన రూటే సపరేటు. కాంట్రవర్షియల్ దర్శకుడైనా వర్మ సినిమాలకు ఎంత ఆదరణ ఉంటుందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే వర్మ తీసే ప్రతి సినిమాలో ఓ వివాదం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.వర్మ పెట్టే పోస్టులకు సోషల్ మీడియాలో తెగ ఫాలోయింగ్ వుంటుంది. అందుకే వర్మ ఏదైనా ట్విట్ చేసాడంటే చాలు ఆది క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది నెటిజన్లను ఆకర్షిస్తూ ఉంటుంది. అయితే వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ వివాదాలు చుట్టూ తిరుగుతారో... లేకపోతే వివాదాలే వర్మ చుట్టూ తిరుగుతాయో అన్నది మాత్రం ఎవరికీ అర్థం కాదు. అంతేకాకుండా సెన్సేషనల్ డైరెక్టర్ వర్మ ఎప్పుడు ఎవరిని ఎలా టార్గెట్ చేస్తారన్నది కూడా ఊహ కందకుండా ఉంటుంది. ఇటు వర్మ తీసే సినిమాల గురించి అయితే కొత్తగా చెప్పాల్సిన పనిలేదు.
సాదాసీదా సినిమాలు తీయడానికి వర్మ అసలు ఇష్టపడడు... రామ్ గోపాల్ వర్మ సినిమా తీస్తున్నాడు అంటే దానికి ఓ రేంజ్ ఉండాలి ఓ పెద్ద వివాదం దానికి అటాచ్ చేసి ఉండాలి అలా అయితేనే తప్ప వర్మ సినిమా జోలికి రాడు . ఇప్పటికే లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో చంద్రబాబు ను ఉతికారేసిన వర్మ... తాజాగా కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే సినిమాకి తెరలేపిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత నుండి ఇప్పటివరకు జరిగిన రాజకీయ పరిణామాలు అన్నింటిని చూపించబోతున్నట్లు ఇప్పటికే వర్మ క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే ఆంధ్ర రాజకీయ ప్రముఖులు అయిన జగన్ చంద్రబాబు సహా ఇతరుల పాత్రలు కూడా ఉన్నట్లు ట్రైలర్ లోనే క్లారిటీ ఇచ్చిన వర్మ... కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే సినిమా నుంచి ఒక్కో పాటను విడుదల చేస్తూ సంచలనం సృష్టిస్తున్నాడు.
తన సినిమాతో ఇప్పటికే కాక పుట్టిస్తున్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో సంచలన ప్రకటన చేశాడు. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే సినిమాకు సీక్వెల్ తీయాలనే ఆలోచన వచ్చింది అంటూ వర్మ ప్రకటించాడు. తాజాగా టీడీపీకి గుడ్బై చెప్పిన వల్లభనేని వంశీ టిడిపి అధినేత చంద్రబాబు పై ఫైర్ అవుతున్న ఇంటర్వ్యూలు చూసిన తర్వాత తనకు కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే సినిమాకు సీక్వెల్ తీయాలనే ఐడియా వచ్చింది అంటూ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెలిపాడు. అయితే ఈ సీక్వెల్ కు రెడ్డి రాజ్యానికి కమ్మ ఫ్యాన్స్ అని టైటిల్ పెడతానంటూ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు రాంగోపాల్ వర్మ.