రాశీ ఖన్నాకు ఏమైంది?  అందరిదీ ఇదే ప్రశ్న. ఈ అమ్మడి ఇన్ స్టాగ్రామ్ ఫోటోలు చూసిన తర్వాత ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. మిగతా వాళ్లు అవాక్కయ్యారు. గ్లామర్ తో రెచ్చిపోవడంతో ప్రస్తుతం నెటిజన్లు అందరూ రాశి గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ ఫోటోలు రాశీఖన్నావే అంటే నమ్మడం కాస్త కష్టమే. బొద్దుగా ఉండే ఈ అమ్మడు జీరో ప్యాక్ లోకి వచ్చేసింది. అందులోనూ.. ఇలా గ్లామర్ గుప్పిస్తుందని ఊహించకపోవడంతో.. రాశీఖన్నానా కాదా అన్న అనుమానం వచ్చింది. 


సినిమాలో ఒయ్యారాలు ఒలకబోసినా.. బైట మాత్రం పద్దతిగా కనిపించే రాశీఖన్నా ఈ మధ్య డోస్ పెంచింది. నన్ను ఒక గ్లామర్ డాల్ లా గుర్తించండి అంటూ.. ఇన్ స్టా గ్రామ్ ను క్లీవేజ్ అందాలతో నింపడం స్టార్ట్ చేసింది. ఇన్ డైరెక్ట్ గా అందాల ఆరబోతకు నేను రెడీ అని చెప్పకనే చెబుతోంది రాశీ. 


రాశీఖన్నా ప్రస్తుతం తెలుగులో మూడు.. తమిళంలో ఒక  సినిమా చేస్తోంది. విజయ్ సేతుపతితో జత కట్టిన చిత్రం ఈ నెల 15న రిలీజ్ అయింది. సాయి ధరమ్ తేజ్ సరసన నటించిన "ప్రతిరోజు పండగే" డిసెంబర్ 20న.. వెంకీమామ.. వరల్డ్ ఫేమస్ లవర్ 2020 జనవరి, ఫిబ్రవరిలో రిలీజ్ కానున్నాయి. యంగ్ హీరోలతో మాత్రమే జతకడుతున్న రాశీ,.. జైలవకుశ తర్వాత పెద్ద హీరోల పక్కన నటించలేదు. మరి ఈ గ్లామర్ బ్యూటీకి ఆ ఛాన్స్ వస్తుందో లేదో చూద్దాం..   


మొత్తానికి రాశీఖన్నా కుర్రాళ్ల గుండెల్లో గుబులు రేపుతోంది. తమ అందాల రాశీ ఇంతలా రెచ్చిపోతోంది ఏంటీ? అని గుసగుసలాడుకుంటున్నారు. ఇక ముందు చేయబోయే సినిమాల్లో తమ గ్లామర్ షో ఉంటుందని పరోక్షంగా చెప్పకనే చెబుతోంది ఈ అమ్మడు. చూడాలి మరి ఆ అందాల విందు ఎలా ఉంటుందో..!


మరింత సమాచారం తెలుసుకోండి: