తెలుగు రాజకీయాలను సినిమాల రూపంలో చిత్రీకరిస్తూ వివాదాస్పద సినిమాలు చేస్తున్న డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఈ సినిమా విడుదల కాకముందు గతంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారి రెండో భార్య లక్ష్మీపార్వతి ని టార్గెట్ చేస్తూ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ ఆంధ్ర రాజకీయాల్లో మరియు నందమూరి కుటుంబంలో మరియు అదే విధంగా తెలుగుదేశం పార్టీలో కలకలం సృష్టించింది.


అప్పట్లో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విడుదల అవ్వకుండా అప్పటికి అధికారంలో ఉన్న టిడిపి ప్రభుత్వం అడ్డుకోవడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో ప్రస్తుతం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే సినిమా చిత్రీకరిస్తూ సోషల్ మీడియాలో ఆ సినిమాకి సంబంధించి పాత్రలకు సంబంధించిన ఫోటోలు విడుదల చేస్తూ రచ్చ రచ్చ చేస్తున్న రామ్ గోపాల్ వర్మ...గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే వల్లభనేని వంశీని టార్గెట్ చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వల్లభనేని వంశీ ఎపిసోడ్ ఎలక్ట్రానిక్ మీడియాలో మరియు సోషల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్ అయింది.


తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తూ ఎమ్మెల్యే కూడా రాజీనామా చేయాలనే ఆలోచనలో ఉన్న వల్లభనేని వంశీ ఇటీవల ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ లో డిబేట్ కి వచ్చిన సందర్భంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కీలక నాయకుడు పై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉంచే ప్రస్తావన తీసుకు వస్తూ రాంగోపాల్ వర్మ…వంశీ ని చూసాక కమ్మ రాజ్యం లో కడప రెడ్లు చిత్రానికి సీక్వెల్ ప్లాన్ చేయడానికి ఒక ఐడియా వచ్చిందని అన్నారు. అంతే కాకుండా దానికి టైటిల్ ని కూడా అనౌన్స్ చేసారు. రెడ్డి రాజ్యానికి కమ్మ ఫాన్స్ అంటూ తెలిపారు. ఈ విషయం లో నెటిజన్లు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: