విశ్వ సుందరి ఐశ్వర్యరాయ్ గురించి మన దేశంలో దాదాపుగా తెలియని వారు ఎవరూ ఉండరు అనే చెప్పాలి. 1994లో విశ్వ సుందరి కిరీటాన్ని గెలిచిన ఈ భామ 1997లో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఇద్దరు సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టారు. తొలి సినిమాతోనే సూపర్ హిట్ ని సొంతం చేసుకున్న ఐశ్వర్య, ఆ తరువాత పలువురు కోలీవుడ్, బాలీవుడ్ అగ్ర నటుల సరసన హీరోయిన్ గా నటించి ఎంతో గొప్ప పేరుని దక్కించుకున్నారు. ఇక ఐశ్వర్య అందం గురించి ఎంత చెప్పినా తక్కువే అనాలి. 

కెరీర్ తొలినాళ్లలో కుర్రాళ్ళ గుండెల్లో గుబులు రేపి వారికి నిద్ర లేకుండా చేసిన ఈ భామ, కొన్నాళ్ల తరువాత అమితాబ్ బచ్చన్ గారి ఇంటి కోడలు అయింది. ఆయన తనయుడు అభిషేక్ బచ్చన్ ని వివాహం చేసుకున్న అనంతరం ఐశ్వర్య సినిమాల్లో నటించడం బాగా తగ్గించారు. ప్రస్తుతం తన ముద్దుల కూతురు ఆరాధ్యను చూసుకుంటూ ఎంతో ఆనందంగా లైఫ్ ని గడుపుతున్నారు. ఇక వయసు ఎంత పెరుగుతున్నప్పటికీ కూడా ఐశ్వర్య ఇంకా తన అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇటీవల అంబానీ ఫ్యామిలీలో జరిగిన ఒక వేడుకలో తన భర్త అభిషేక్ తో కలిసి శారీ లుక్ లో ఎంతో అందంగా మెరిసిన ఐశ్వర్య

నేడు ముంబై లో జరిగిన ఒక ప్రత్యేక ఫోటో షూట్ లో తన ఆకట్టుకునే అందాలతో కుర్రాళ్ళ మతులు పోగొట్టారు అనే చెప్పాలి. లేటెస్ట్ ట్రెండీ స్టైల్ డ్రెస్ తో తన యద అందాలు ఆరబోస్తూ ఆమె దిగిన ఫోటోలు ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాలలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇక ఆమె ఫోటోలు పై పలువురు నెటిజన్లు, లేటు వయసులో కూడా ఐశ్వర్య తన ఘాటు అందాలతో అందరి మతి పోగొడుతున్నారు అంటూ సరదాగా తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కామెంట్స్ చేస్తున్నారు. గత ఏడాది అనిల్ కపూర్ హీరోగా తెరకెక్కిన ఫన్నే ఖాన్ లో ఒక ముఖ్య పాత్రలో నటించారు ఐశ్వర్య.....!!  


మరింత సమాచారం తెలుసుకోండి: