వంద రోజులకు పైగా బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరించిన బిగ్ బాస్  తెలుగు సీజన్3  షో  గత రెండు మూడు వారాలు కిందే ముగిసిన విషయం తెలిసిందే. బుల్లితెర ప్రేక్షకులను టీవీలకు కట్టిపడేసిన ఈ షోలో టైటిల్ విన్నర్ గా రాహుల్ నిలిచాడు  . అయితే రాహుల్ సిప్లిగంజ్ కి టైటిల్ ని ప్రెసెంట్  చేసేందుకు చీఫ్ గెస్ట్ గా వచ్చారు మెగాస్టార్ చిరంజీవి .ఇదిలా ఉంటే  బిగ్ బాస్ హౌస్ లో ఎక్కువగా ఫేమస్ అయిన జంట ఎవరు అంటే టక్కున గుర్తొచ్చేది  పునర్నవి రాహుల్ సిప్లిగంజ్ జంట . ఎందుకంటే వితిక వరుణ్ సందేశ్ జంటగా హౌస్  లోపలికి వెళ్లినప్పటికీ... బిగ్ బాస్  చూస్తున్న బుల్లితెర ప్రేక్షకులు మాత్రం పునర్నవి రాహుల్ సిప్లిగంజ్ జంటకే ఎక్కువ ఆకర్షితులయ్యారు.ఇక వీరిద్దరి జంటను  చూసి  మురిసిపోయిన బిగ్ బాస్  ప్రేక్షకులు ఎంతో మంది. 

 

 

 

 బిగ్ బాస్ షో ముగిసి పోయాక కూడా వీరిద్దరూ పై వస్తున్న వార్తలు మాత్రం ఎక్కడా తగ్గలేదు. వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని... వీరిద్దరి మధ్య ప్రేమ ఎక్కువ అయిపోయిందని... వీరి పెళ్లికి పేరెంట్స్ కూడా ఒప్పుకున్నారు అంటూ ఎన్నో వార్తలు హల్ చల్ చేశాయి. కానీ ఇద్దరు తాము మంచి స్నేహితులని తమ మధ్య ఎలాంటి ప్రేమ లేదంటూ ఎన్నోసార్లు క్లారిటీ ఇచ్చారు. అయితే బిగ్ బాస్ హౌస్ లో పునర్నవి రాహుల్ జంటకి ఫేమ్  కూడా బాగానే పెరిగిపోయింది. అయితే తాజాగా  పునర్నవి రాహుల్ జంటగా ఈటీవీ లో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా కార్యక్రమానికి కలిసి వచ్చారు. 

 

 

 ఈ సందర్భంగా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అలీ  వీరిద్దరిని కొన్ని ఆసక్తికర ప్రశ్నలను అడిగారు. ఇక వీరిద్దరూ కూడా కొన్ని ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో షేర్ చేసుకున్నారు . ఈ సందర్భంగా మాట్లాడిన అలీ  పునర్నవి కీ  సోషల్ మీడియాలో చాలా పేర్లు ఉన్నాయి అని తెలిపారు . పున్ను,   పులిహోర రాణి,  కోపిష్టి  పిల్ల అనే పేర్లు నెటిజన్లు పెట్టుకున్నారు అని తెలిపారు . అలీ మాటలు వినగానే పునర్నవి రాహుల్ సిప్లిగంజ్ ఇద్దరూ నవ్వుకున్నారు. అయితే పునర్నవి బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు చాలా మంది పై సీరియస్ అయ్యి  గొడవలు పడిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: