నాగచైతన్య మజిలీకి ముందు హిట్స్ కోసం చాలా ఇబ్బందులు పడ్డాడు. మంచి కథ ఎంచుకున్నా ఏదో ఒక లోపంతో
సినిమా ఫెయిల్ అవుతూ వస్తుండేది. మంచి సాలిడ్ హిట్ అందుకొని చాలా కాలం అయింది. అయితే,
మజిలీ సినిమాతో ఆ కోరిక తీరిపోయింది.
మజిలీ సినిమా దాదాపుగా రూ.50 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించి నిర్మాతలకు లాభాల పంట పండించింది.
ఇప్పుడు ఈ
హీరో వెంకిమామ
సినిమా చేస్తున్నాడు. మామ
వెంకటేష్ తో కలిసి హంగామా చేస్తున్నాడు. ఇందులో చైతుకు జోడిగా రాశిఖన్నా నటిస్తుండటం విశేషం. ఈ సినిమాతో పాటుగా చైతు..
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో
సినిమా చేస్తున్నాడు. ఈ
సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నది. త్వరలోనే ఇది కూడా రిలీజ్ అవుతుంది. ఇందులో సాయి పల్లవి హీరోయిన్. ఈ రెండు సినిమాలతో పాటు చైతు మరిన్ని సినిమాలు లైన్లో ఉన్నట్టుగా తెలుస్తోంది.
కాగా, బాలీవుడ్లో భారీ హిట్ అందుకుంది. ఈ
మూవీ రిలీజైన కొన్ని రోజులకు చిచ్చోరే రిలీజ్ అయ్యింది. ఇది కూడా మంచి విజయం సొంతం చేసుకుంది. కామెడీలో కమర్షియల్ జోడించడంతో హిట్ అందుకుంది. ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో
రీమేక్ చేయబోతున్నారు.
గీత గోవిందం వంటి మంచి హిట్ ఇచ్చిన దర్శకుడు పరశురామ్ ఈ సినిమాను
రీమేక్ చేయబోతున్నారని టాక్. ఇందులో నాగచైతన్య హీరోగా చేయబోతున్నారని టాక్ వినిపిస్తోంది. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ సినిమాను నిర్మించబోతున్నట్టు సమాచారం.