నాగచైతన్య మజిలీకి ముందు హిట్స్ కోసం చాలా ఇబ్బందులు పడ్డాడు.  మంచి కథ ఎంచుకున్నా ఏదో ఒక లోపంతో సినిమా ఫెయిల్ అవుతూ వస్తుండేది.  మంచి సాలిడ్ హిట్ అందుకొని చాలా కాలం అయింది.  అయితే, మజిలీ సినిమాతో ఆ కోరిక తీరిపోయింది.  మజిలీ సినిమా దాదాపుగా రూ.50 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించి నిర్మాతలకు లాభాల పంట పండించింది.  


ఇప్పుడు ఈ హీరో వెంకిమామ సినిమా చేస్తున్నాడు.  మామ వెంకటేష్ తో కలిసి హంగామా చేస్తున్నాడు.  ఇందులో చైతుకు జోడిగా రాశిఖన్నా నటిస్తుండటం విశేషం.  ఈ సినిమాతో పాటుగా చైతు.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు.  ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నది.  త్వరలోనే ఇది కూడా రిలీజ్ అవుతుంది.  ఇందులో సాయి పల్లవి హీరోయిన్. ఈ రెండు సినిమాలతో పాటు చైతు మరిన్ని సినిమాలు లైన్లో ఉన్నట్టుగా తెలుస్తోంది.  


తండ్రి నాగార్జునతో కలిసి చైతు బంగార్రాజు చేయాల్సి ఉన్నది.  ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అన్నది తెలియాల్సి ఉన్నది.  వెంకిమామ సినిమా రిలీజ్ తరువాత ఈ సినిమా రిలీజ్ కావొచ్చు.  ఇక ఇదిలా ఉంటే, నాగచైతన్య కన్ను బాలీవుడ్ సినిమాపై పడింది.  బాలీవుడ్ లో శ్రద్దా కపూర్, సుశాంత్ రాజ్ పుత్ జంటగా నటించిన చిచ్చోరే సినిమా మంచి విజయం అందుకుంది.  సాహో సినిమా టాలీవుడ్ లో పెద్దగా హిట్ కాలేదు.  


కాగా, బాలీవుడ్లో భారీ హిట్ అందుకుంది.  ఈ మూవీ రిలీజైన కొన్ని రోజులకు చిచ్చోరే రిలీజ్ అయ్యింది.  ఇది కూడా మంచి విజయం సొంతం చేసుకుంది.  కామెడీలో కమర్షియల్ జోడించడంతో హిట్ అందుకుంది.  ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయబోతున్నారు.  గీత గోవిందం వంటి మంచి హిట్  ఇచ్చిన దర్శకుడు పరశురామ్ ఈ సినిమాను రీమేక్ చేయబోతున్నారని టాక్.  ఇందులో నాగచైతన్య హీరోగా చేయబోతున్నారని టాక్ వినిపిస్తోంది.  ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ సినిమాను నిర్మించబోతున్నట్టు సమాచారం.  


మరింత సమాచారం తెలుసుకోండి: