స్టార్ హీరోల మధ్య పోటీ ఉండటం సహజం. అందులోనూ సంక్రాంతికి పోటీ పడితే మహా రంజుగా ఉంటుంది. ఏ హీరో సినిమా ఎంత కలెక్ట్ చేస్తుందోనని ఆసక్తి నెలకొంటుంది. ఇలాంటి పోటీ హీరోలకు, దర్శకులకు కొత్తేం కాదు. కానీ ఇదే పోటీ హీరోయిన్ల మధ్య వస్తే ఆ మజానే వేరు. ఈ సంక్రాంతికి ఇదే జరుగబోతుంది. ఇద్దరు హీరోయిన్ల సినిమాలు సంక్రాంతి బరిలో నిలవడంతో ఎవరు విజయం సాధిస్తారోనని ఆడియన్స్ లో ఆసక్తి నెలకొంది.

 


అల.. వైకుంఠపురంలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంటే.. సరిలేరు నీకెవ్వరులో మహేశ్ సరసన రష్మిక మందనా హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్ లో వీరిద్దరిదే హవా. వీరిలో పూజా హెగ్డే స్టార్ హీరోల సరసన నటిస్తూ క్రేజ్ తెచ్చుకుంది. కానీ.. రష్మిక స్టార్ హీరోల సరసన ఇప్పుడు నటిస్తోంది. ఛలోతో హిట్ కొడితే గీత గోవిందంతో స్టార్ హీరోయిన్ అయిపోయింది. దీంతో పెద్ద హీరోల సరసన అవకాశాలు వస్తున్నాయి. కానీ ఆమె నటిస్తున్న సినిమాలు హైప్ క్రియేట్ అవుతున్నాయి. డియర్ కామ్రేడ్ సినిమాకు వచ్చిన క్రేజ్ సగం రష్మిక వల్లే అని తెలిసిన విషయమే.

 


దీంతో ఈ సంక్రాంతికి ఇద్దరు స్టార్ హరోల మధ్యే కాకుండా ఇద్దరు స్టార్ హీరోయిన్ల మధ్య అని కూడా అర్ధమవుతోంది. ఇప్పటికే వీరిద్దరిలో ఎవరు స్టార్ హీరోయిన్ అనే ప్రశ్న మొదలైంది కూడా. పూజా హెగ్డే స్టార్ హీరోల సినిమాల్లో నటించినా పక్కా బ్లాక్ బస్టర్ హిట్ అనేది లేదు. కానీ రష్మికకు గీత గోవిందంతో పక్కా సాలిడ్ బ్లాక్ బస్టర్ ఉంది. దీంతో ఇప్పుడు సంక్రాంతికి ఈ హీరోయిన్ల మధ్య జరిగే పోటీలో ఎవరు గెలుస్తారో అనేది ఆసక్తిగా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: