ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ షో కి ఉన్న క్రెజ్  గురించి అందరికీ తెలిసిందే. ఒక సాదాసీదా కామెడీ షో గా  మొదలైన జబర్దస్త్...టాప్  రేటింగ్స్ దూసుకుపోతోంది.జబర్దస్త్ తర్వాత ఎన్నో కామెడీ షోలు వచ్చినప్పటికీ  జబర్దస్త్ కామెడీ షో జబర్దస్త్ ముందు నిలవలేకపోయింది. ఇక జబర్దస్త్ మొదలైనప్పటి నుండి జడ్జీలుగా వ్యవహరిస్తున్న  నాగబాబు రోజాలు నవ్వుల తో  కూడా జబర్దస్త్ ఇంకెంతో ఫేమస్ అయిపోయింది. ప్రస్తుతం ఈటీవీలో జబర్దస్త్ వస్తుందంటే చాలు తెలుగు ప్రేక్షకులందరూ టీవీలకు అతుక్కుపోతారు. ఇక జబర్దస్త్ కామెడీ స్కిట్లు చూసి పగలబడి నవ్వుకుంటారు. అయితే గత కొన్ని రోజుల నుండి జబర్దస్త్ షో కి సంబంధించి కొన్ని వార్తలు హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. 



 జబర్దస్త్ కామెడీ షో నుంచి కొంతమంది టీమ్ లీడర్లు...  జడ్జిగా ఉన్న నాగబాబు కూడా పక్కకు తప్పుకుంటున్నారని... దీంతో జబర్దస్త్ షోని  మూసి వేస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు బాగా వినిపిస్తున్నాయి. అయితే జబర్దస్త్ మొదలైనప్పటి మంచి జడ్జ్ లుగా  ఉన్న  నాగబాబు రోజా తమ నవ్వులతోనే షోని  హైలెట్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు  లేకుండా జబర్దస్త్ నిర్వహించడం అనేది తెలుగు ప్రేక్షకులు ఊహించని  మాట. అయితే జబర్దస్త్ కామెడీ షోకి జడ్జ్ గా నాగబాబు తప్పుకోవటం  లేదని నాగబాబు కచ్చితంగా జడ్జి గా కొనసాగుతారని మల్లెమాల ప్రొడక్షన్స్ చెబుతున్నప్పటికీ... సోషల్ మీడియాలో మాత్రం వేరేలా వార్తలు వస్తూనే ఉన్నాయి. 



 నాగబాబు తోపాటు హైపర్ ఆది చమ్మక్ చంద్ర సుడిగాలి సుదీర్ లాంటి చాలా ఫేమస్ అయిన టీమ్స్ కూడా జబర్దస్త్ మానేసి వెళ్ళిపోతున్నారు  అంటూ వార్తలు వస్తున్నాయి. జబర్దస్త్ కామెడీ షో కి పోటీగ జీ తెలుగులో మరో భారీ కామెడీ షో ప్లాన్ చేస్తున్నారని... అందరూ జబర్దస్త్ టీం లీడర్స్ తో  పాటు జడ్జ్  నాగబాబును కూడా భారీ రెమ్యునరేషన్ ఇచ్చి మరీ తీసుకుంటున్నారు అంటూ ప్రచారం జరుగుతోంది. ఇక తాజాగా విడుదలైన ప్రోమో కూడా ఈ వార్తలకు  బలం చేకూరుస్తుంది. ఇప్పుడు వరకు ఈ టీవీ లో మాత్రమే జడ్జ్ గా కనిపించిన  మెగా బ్రదర్ నాగబాబు  ఇప్పుడు జీ తెలుగు విడుదల చేసిన ప్రోమోలు కూడా దర్శనమిచారు . నాగబాబు  తో పాటు... చాలా రోజుల గ్యాప్ తీసుకున్న ప్రదీప్  కూడా ఈ ప్రోమోలో  కనిపిస్తున్నారు. అటు యాంకర్ రవి కూడా ఈ ప్రోమో లో కనిపిస్తున్నారు. ఈ క్రమంలో జబర్దస్త్ జడ్జ్ గా  నాగబాబు పక్కకు తప్పుకున్నారు అని... అంతేకాకుండా పటాస్ షో నుంచి యాంకర్ రవి కూడా బయటకు వస్తున్నాడు అంటూ ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం జీతెలుగు విడుదల చేసిన ప్రోమోలో  ఇద్దరు ఉండడం కూడా ఆ వార్తలకు బలాన్ని చేకూరుస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: