ప్రస్తుతం టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, అతి త్వరలో కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కబోయే తన 152వ సినిమా కోసం అన్ని విధాలా సిద్ధం అవుతున్నారు. గోవిందా హరి గోవిందా అనే టైటిల్ తో, మెగాస్టార్ డ్యూయల్ రోల్ లో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు టాక్. ఇక ఈ సినిమా కోసం సంగీత దర్శకుడుగా ఎవరిని తీసుకోవాలి అని కొద్దిరోజులుగా సినిమా యూనిట్ ఎంతో ఆలోచన చేస్తోందనే వార్తలు టాలీవుడ్ వర్గాల్లో హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. అయితే నేడు ఆ విషయమై సినిమా యూనిట్ ఒక నిర్ణయానికి వచ్చిందని, ఈ సినిమాకు పని చేయబోయే సంగీత దర్శకుడు మరెవరో కాదని, ఇటీవల మెగాస్టార్ మరియు సురేందర్ రెడ్డి ల కలయికలో వచ్చిన సైరా నరసింహారెడ్డి సినిమాకు సంగీతాన్ని అందించిన అమిత్ త్రివేది అని అంటున్నారు. 

నిజానికి తన ప్రతి సినిమాకు దేవిశ్రీప్రసాద్ నే తీసుకునే కొరటాల, ప్రస్తుతం ఆయన డేట్స్ ఖాళి లేకపోవడంతో ఫైనల్ గా అమిత్ ని తీసుకోవడానికి సిద్దమయ్యారట. ఇకపోతే మరోవైపు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజ హెగ్డే హీరోయిన్ గా తెరక్కుతున్న తాజా సినిమా జాన్. యువ దర్శకుడు మరియు ఇటీవల గోపీచంద్, రాశి ఖన్నా ల కలయికలో జిల్ మూవీ ని తెరకెక్కించిన రాధాకృష్ణ దర్శకత్వంలో ఎంతో భారీ ఖర్చుతో తెరకెక్కుతున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ అతి త్వరలో హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో మొదలు కానున్నట్లు తెలుస్తోంది. 

ఇక ఈ సినిమాకు కోసం సంగీత దర్శకుడిగా ఎవరిని తీసుకోవాలని కొద్దరోజులుగా యోచించిన సినిమా యూనిట్, ఎట్టకేలకు ఇటీవల అమిత్ త్రివేదిని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. పలు బాలీవుడ్ సినిమాలకు అలరించే సంగీతాన్ని అందించిన అమిత్ అయితే, తమ సినిమాకు న్యాయం చేయగలడని భావించి అతడిని తీసుకున్నట్లు టాక్. సో, ఈ విధంగా అటు మెగాస్టార్ సినిమా, ఇటు రెబల్ స్టార్ సినిమాలు తన ఖాతాలో వేసుకుని ఒకేసారి రెండు గోల్డెన్ ఛాన్సులు కొట్టేసాడు అమిత్ త్రివేది. అయితే నేడు ప్రచారం అవుతున్న ఈ వార్తలపై ఆయా సినిమాల యూనిట్ల నుండి అధికారిక ప్రకటన మాత్రం వెలువడాల్సి ఉంది.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: