టాలీవుడ్ లో స్టార్ స్టేటస్ తో పాటు నెంబర్ వన్ హీరోయిన్ గా వెలిగిన ఇలియానా.. అదే టాలీవుడ్ ని కాదనుకుంది. బాలీవుడ్ పై మోజుతో తెలుగు సినిమాలకు దూరమైపోయింది. 2012లో చేసిన దేవుడు చేసిన మనుషులు సినిమా తర్వాత 2018లో చేసిన అమర్ అక్బర్ ఆంటోని వరకూ తెలుగు పరిశ్రమ వంక చూడలేదు సరికదా.. విమర్శలు కూడా చేసింది. కానీ.. ఈమధ్య తన ఆస్ట్రేలియన్ లవర్ ఆండ్రే నీబోన్ తో బ్రేక్ అప్ తర్వాత మళ్లీ టాలీవుడ్ లో సినిమాలు చేయాలని తపిస్తోంది.

 


ఈ మధ్య ఇలియానా వద్దకు రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ వచ్చాయని సమాచారం. ఈ రెండూ బన్నీ, మహేశ్ సరసన అని ఇండస్ట్రీ టాక్. అల.. వైకుంఠపురంలో, సరిలేరు నీకెవ్వరు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ కోసం మొదట ఇలియానానే సంప్రదించినట్టు చెప్తున్నారు. అయితే ఇంకా హీరోయిన్ గా చేసే సత్తా తనకు ఉందని ఈ ఆఫర్స్ రిజెక్ట్ చేసినట్టు సమాచారం. ఆరేళ్ల గ్యాప్ తర్వాత సినిమా చేసినా రెండు కోట్లు రెమ్యునరేషన్ తీసుకోగలిగిందంటే ఆమెకున్న క్రేజ్ అర్ధం చేసుకోవచ్చు. హీరోయిన్ అవకాశాల కోసం తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా తన ఉనికిని సినీ ఇండస్ట్రీకి మళ్లీ పరిచయం చేస్తోంది. బొద్దుగా తయారైన ఇలియానా సన్నబడేందుకు జిమ్ వర్కౌట్లు కూడా చేస్తోంది.

 


మెగాస్టార్ చిరంజీవి 152వ సినిమాలో ఇలియానాను తీసుకుంటున్నారనే వార్త కూడా హల్ చల్ చేసింది. కానీ ఆ వార్తల్లో నిజం లేకపోయింది. ఇలియానా స్పెషల్ సాంగ్స్ చేసినా ఆమె క్రేజ్ కి వచ్చిన ఇబ్బంది ఏమీ ఉండదు. కానీ లాంగ్ గ్యాప్ తర్వాత సినిమా అవకాశాలు కోసం చూస్తున్నప్పుడు ఇలా స్పెషల్ సాంగ్స్ చేస్తే వాటికే పరిమితమైపోతాననే ఉద్దేశ్యంతోనే ఈ ఆఫర్లు రిజెక్ట్ చేసిందని అంటున్నారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: