మజిలీ వంటి గ్రాండ్ సక్సెస్ తర్వాత నాగచైతన్య ఫుల్ ఫాం లో ఉన్నాడు.  చై-సామ్ జంట కెరీర్ కి మజిలీ ఎప్పటికీ ఓ మధుర జ్ఞాపకమే. ఎందుకంటే చైతూ కి మార్కెట్లో ఇమేజ్ ఓ రేంజ్ లో పెంచిన సినిమా మజిలీ కావడం విశేషం. ఇక సమంతకు ఈ సినిమా తర్వాత అన్ని రకాలుగా కలిసొస్తోంది. ప్రస్తుతం నాగ చైతన్య మేనమామ వెంకటేష్ తో కలిసి వెంకీ మామ సినిమాలో నటిస్తున్నాడు. రీసెంట్‌గా ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసి శేఖర్ కమ్ములతో జాయిన్ అయ్యాడు. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే నెక్స్ట్ సినిమా కోసం కథల్ని వింటున్నాడట.  అంతే కాదు స్క్రిప్టు నచ్చితే వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నాడని లేటెస్ట్ న్యూస్.

చైతన్య కు ఇప్పటికే కథలు వినిపించిన వాళ్ళలో ఆర్.ఎక్స్ -100 ఫేం అజయ్ భూపతి తో పాటు యువ దర్శకులు కూడా ఉన్నారు. అజయ్ భూపతి ప్రాజెక్ట్ ఫైనల్ అయినప్పటికి ఎందుకనో అఫీషియల్ గా ప్రాజెక్ట్ గురించి అనౌన్స్ చేయలేదు. ఈ నేపథ్యంలో తాజాగా చైతూ ఓ బాలీవుడ్ రీమేక్ పై ఇంట్రస్ట్ గా ఉన్నాడని తెలుస్తోంది.  రీసెంట్‌గా రిలీజై బ్లాక్ బస్టర్ అయిన బాలీవుడ్ సినిమా చిచ్చోరే రీమేక్ లో నటించడానికి రెడీగా ఉన్నాడట. సుషాంత్ సింగ్ రాజ్ పుత్- శ్రద్దా కపూర్- వరుణ్ వర్మ- ఏజెంట్ ఆచార్య ఫేం.. తెలుగు నటుడు  నవీన్ పోలిశెట్టి నటించిన ఈ సినిమా బాలీవుడ్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వచింది. నితీష్ తివారీ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. 

ఒకవేళ అన్నీ కుదిరితే గీత గోవిందం ఫేం పరశురాం దర్శకత్వం వహించే ఛాన్సుందని ఫిల్మ్ నగర్ లో టాక్ నడుస్తోంది. ఓ పెద్ద నిర్మాణ సంస్థ ఈ సినిమాని నిర్మించడానికి సన్నాహాలు చేస్తుందట. అయితే మజిలీ వంటి స్ట్రెయిట్ కథతో బ్లాక్ బస్టర్ కొట్టిన చైతూ ఈసారి రీమేక్ పైనా దృష్టి పెట్టడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇంతకు ముందు మలయాళ బ్లాక్ బస్టర్ 'ప్రేమమ్' రీమేక్ లో నటించిన చైతన్యకు ఆ సినిమా మంచి సక్సస్ ని ఇచ్చింది. అందుకే ఈసారి బాలీవుడ్ రీమేక్ తో ఎక్స్‌పరిమెంట్ చేస్తున్నాడని తాజా సమాచారం. ఇక మరికొద్ది రోజుల్లొ దీనికి సంబంధించిన అఫీషీల్ అనౌన్స్ మెంట్ రానుందట.  


మరింత సమాచారం తెలుసుకోండి: