మజిలీ వంటి గ్రాండ్
సక్సెస్ తర్వాత నాగచైతన్య ఫుల్ ఫాం లో ఉన్నాడు. చై-సామ్ జంట కెరీర్ కి
మజిలీ ఎప్పటికీ ఓ
మధుర జ్ఞాపకమే. ఎందుకంటే చైతూ కి మార్కెట్లో ఇమేజ్ ఓ రేంజ్ లో పెంచిన
సినిమా మజిలీ కావడం విశేషం. ఇక సమంతకు ఈ
సినిమా తర్వాత అన్ని రకాలుగా కలిసొస్తోంది. ప్రస్తుతం
నాగ చైతన్య మేనమామ
వెంకటేష్ తో కలిసి
వెంకీ మామ సినిమాలో నటిస్తున్నాడు. రీసెంట్గా ఈ
సినిమా షూటింగ్ పూర్తిచేసి
శేఖర్ కమ్ములతో జాయిన్ అయ్యాడు. ఈ
సినిమా సెట్స్ పై ఉండగానే నెక్స్ట్
సినిమా కోసం కథల్ని వింటున్నాడట. అంతే కాదు స్క్రిప్టు నచ్చితే వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నాడని లేటెస్ట్ న్యూస్.
చైతన్య కు ఇప్పటికే కథలు వినిపించిన వాళ్ళలో ఆర్.ఎక్స్ -100 ఫేం
అజయ్ భూపతి తో పాటు
యువ దర్శకులు కూడా ఉన్నారు.
అజయ్ భూపతి ప్రాజెక్ట్ ఫైనల్ అయినప్పటికి ఎందుకనో అఫీషియల్ గా ప్రాజెక్ట్ గురించి అనౌన్స్ చేయలేదు. ఈ నేపథ్యంలో తాజాగా చైతూ ఓ
బాలీవుడ్ రీమేక్ పై ఇంట్రస్ట్ గా ఉన్నాడని తెలుస్తోంది. రీసెంట్గా రిలీజై
బ్లాక్ బస్టర్ అయిన
బాలీవుడ్ సినిమా చిచ్చోరే
రీమేక్ లో నటించడానికి రెడీగా ఉన్నాడట. సుషాంత్ సింగ్
రాజ్ పుత్- శ్రద్దా కపూర్-
వరుణ్ వర్మ- ఏజెంట్ ఆచార్య ఫేం.. తెలుగు నటుడు నవీన్ పోలిశెట్టి నటించిన ఈ
సినిమా బాలీవుడ్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వచింది. నితీష్ తివారీ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు.
ఒకవేళ అన్నీ కుదిరితే
గీత గోవిందం ఫేం పరశురాం దర్శకత్వం వహించే ఛాన్సుందని ఫిల్మ్
నగర్ లో టాక్ నడుస్తోంది. ఓ పెద్ద నిర్మాణ సంస్థ ఈ సినిమాని నిర్మించడానికి సన్నాహాలు చేస్తుందట. అయితే
మజిలీ వంటి స్ట్రెయిట్ కథతో
బ్లాక్ బస్టర్ కొట్టిన చైతూ ఈసారి
రీమేక్ పైనా దృష్టి పెట్టడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇంతకు ముందు మలయాళ
బ్లాక్ బస్టర్ 'ప్రేమమ్'
రీమేక్ లో నటించిన చైతన్యకు ఆ
సినిమా మంచి సక్సస్ ని ఇచ్చింది. అందుకే ఈసారి
బాలీవుడ్ రీమేక్ తో ఎక్స్పరిమెంట్ చేస్తున్నాడని తాజా సమాచారం. ఇక మరికొద్ది రోజుల్లొ దీనికి సంబంధించిన అఫీషీల్ అనౌన్స్ మెంట్ రానుందట.