మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో తీసిన ‘రంగస్థలం’ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో మంచి జోష్ మీద ఉన్న డైరెక్టర్ సుకుమార్ అప్పట్లో నెక్స్ట్ సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఉంటుందని ప్రకటించడం జరిగింది. అయితే ఆ తర్వాత అనివార్య కారణాల వల్ల మహేష్ బాబుతో చేయాల్సిన సినిమా ఆగిపోవటంతో తర్వాత వెంటనే సుకుమార్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా చేస్తున్నట్లు ప్రకటించి తాజాగా ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇటీవల మొదలుపెట్టాడు.


ఇటువంటి తరుణంలో సుకుమార్ దర్శకత్వంలో గతంలో అల్లు అర్జున్ నటించిన ఆర్య, ఆర్య  2 సినిమాలు సూపర్ డూపర్ హిట్ కావడంతో తాజాగా చేయబోయే మూడో సినిమాపై అల్లు అర్జున్ అభిమానులతో పాటు ఇండస్ట్రీ లో ఉన్నా చాలా మందికి ఈ సినిమా ఏ విధంగా ఉంటుందో అని చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే ప్రస్తుతం బన్నీతో చేయబోయే సినిమా ప్రాజెక్ట్ గతంలో తీసిన సినిమా ఫార్ములా పరంగానే తీస్తున్నట్లు వార్తలు వినబడుతున్నాయి.


విషయంలోకి వెళితే డైరెక్టర్ సుకుమార్ కెరియర్లో చేసిన సినిమాల్లో ఎక్కువగా రివెంజ్ బ్యాక్ స్టోరీస్ ని నమ్ముకుని కథలు రాసుకున్న సుకుమార్, మరొక్కసారి బన్నీ సినిమాకు కూడా అదే విధమైన కథను అందించబోతున్నట్లు టాలీవుడ్ వర్గాల టాక్. కొద్దిరోజులుగా గంధం చెక్కల మాఫియా ప్రధానంగా ఈ సినిమా సాగుతుందని వార్తలు వస్తున్నప్పటికీ, అంతర్లీనంగా ఇది కూడా ఒక పక్కా రివెంజ్ డ్రామా అని సమాచారం. త్వరలోనే ఈ సినిమాకి సంబందించిన రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుందని సినిమా నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ సంస్థ కి చెందినవారు తెలపడం జరిగింది. ప్రస్తుతం అల్లు అర్జున్ అల వైకుంఠ పురంబులో సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.   



మరింత సమాచారం తెలుసుకోండి: