మెగా ఫ్యామిలీ నుంచి ఎంతో మంది హీరోలు టాలీవుడ్ హీరోలుగా  ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా ఒకరు. మెగా మేనల్లుడు టాలీవుడ్ కీ  ఎంట్రీ ఇచ్చి  తెలుగు ప్రేక్షకుల్లో ఎంతో  మంది అభిమానాన్ని సంపాదించుకున్నారు. పిల్ల నువ్వు లేని జీవితం అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయిపోయాడు. ఆ తర్వాత చేసిన సినిమాలన్నీ వరుసగా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో సాయిధరమ్ తేజ్  పని అయిపోయిందనే అందరూ అనుకున్నారు. కానీ తాజాగా చిత్రలహరి సినిమా తో  సూపర్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం మెగా  మేనల్లుడు... మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిరోజూ పండగే సినిమాలో నటిస్తున్నాడు.  ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ సరసన రాసి కన్నా నటిస్తోంది. 

 

 

 

 అంతేకాకుండా సోలో బ్రతుకే సో బెటరూ అనే సినిమా  కూడా సాయి ధరంతేజ్ చేయబోతున్నట్లు  సమాచారం. అయితే హీరో సాయి ధరమ్ తేజ్ అటు సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా చాలా ఆక్టివ్ గా ఉంటారు. ఎప్పుడూ తన అప్డేట్స్ ను  అభిమానులకు అందిస్తూ వుంటారు. అంతే కాకుండా అప్పుడప్పుడు అభిమానులతో ఆన్లైన్ చాటింగ్ చేస్తూ ఉంటారు సాయి ధరమ్ తేజ్ . అయితే తాజాగా ఇలా నెటిజన్ల రీప్లే ఇస్తూ  చాట్ చేస్తున్న సమయంలో సోషల్ మీడియాలో ఓ నెటిజన్  మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ను ఏరా అంటూ ఏకవచనం తో మాట్లాడాడు. ఏరా సినిమాలో కామెడీ ఈ రేంజిలో ఉంటుందో అంటుందా అంటూ  సాయి ధరంతేజ్ అని పిలిచాడు ఓ నెటిజన్ . 

 

 

 

 అయితే ఆ మెసేజ్ సీరియస్ గా  తీసుకోకుండా సరదాగా తీసుకున్న మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ అంతే సరదాగా రిప్లై ఇచ్చారు. లేదురా దీనికి 1000 రేట్లు  ఎక్కువగా ఉంటుంది అంటూ రిప్లై ఇచ్చాడు. దీంతో షాక్ అయినా అభిమాని బ్రహ్మానందం ఫోటోలు రిప్లై గా పెట్టారు. దానికి సాయి ధరంతేజ్ కూడా బ్రహ్మానందం ఫొటోని రీప్లే పెట్టాడు . ఇక ఆ తర్వాత ఆ నెటిజన్  సారీ అన్న తెలియక కామెంట్ చేశాను...  గుడ్ లక్ అంటూ చెప్పేసాడు. ప్రస్తుతం ఈ  చాట్   సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇదిలా ఉండగా గతంలో పిల్ల నువ్వు లేని జీవితం అనే సినిమా సూపర్ హిట్ తర్వాత వరుసగా ఏడు సినిమాలు అపజయాలు అందుకున్నాడు మెగా  మేనల్లుడు . మరి ఇప్పుడు తాజాగా చిత్రలహరి సినిమా హిట్ తర్వాత చేస్తున్న ప్రతి రోజు పండుగ సినిమా ప్రేక్షకులను ఎలా అలరిస్తుందో...విజయం  సాధిస్తుందా లేదా అన్నది చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: