గత కొన్ని రోజులుగా శ్రీ రెడ్డి గురించి అనేకమైన తప్పుడు వార్తలు వస్తున్నాయి. తాజాగా ఆమె లారెన్స్, విశాల్ లాంటి హీరోలను విమర్శించిందని అంటూ ఆమె నకిలీ ఖాతాల ఆధారంగా చాలా వార్తలు వెల్లువెత్తయి. మొన్న ఈ మధ్య విశాల్ ద్వారా స్టాలిన్‌ను కలిసానని ఆ తర్వాత అవకాశం ఇప్పిస్తానని చెప్పి... గ్రీన్ పార్క్ హోటల్‌లో రాత్రంతా తనతో లైంగికంగా కలిసామని, ఆ రాత్రంతా ఎన్నో చేశాం కదా స్టాలిన్ గారూ.. కానీ ఇప్పటి వరకు మీరు నాకు ఛాన్స్ ఇవ్వలేదంటూ ఎవరో శ్రీ రెడ్డి పేరుతో కావాలనే పని కట్టుకొని ఫేసుబుక్ వేదికగా పోస్ట్ చేసారు. 


దీంతో ఈ పోస్ట్ తెగ వైరల్ అయ్యి చివరకు మెయిన్ స్ట్రీమ్ వార్త వెబ్సైట్లు వాళ్లు కూడా ఈ పోస్ట్ గురించి రాసారు. ఇది తెలుసుకున్న శ్రీ రెడ్డి దీనిపై వివరణ ఇవ్వడానికి ఆమె చెన్నైలోని ప్రసాద్‌ ల్యాబ్‌లో శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.


ఈ సందర్భంగా మాట్లాడుతూ "కరుణానిధి కుటుంబంపై నాకు గౌరవ మర్యాదలు ఉన్నాయి. ఉదయనిధిని నేను నేరుగా చూసిన సందర్భం లేదు. ఆయన గురించి వచ్చిన పోస్టు.. నా ఫేస్‌బుక్‌ ఖాతాది కాదు. అది ఓ నకిలీ ఖాతా. ఎవరో పనిగట్టుకుని అలా చేశారు. ఉదయనిధి పేరు ప్రతిష్ఠలను దెబ్బతీయాలని చేస్తున్న చర్యలివి. నా పేరిట సామాజిక మాధ్యమాల్లో పలు నకిలీ ఖాతాలు ఉన్నాయి. దీనికి సంబంధించి సైబర్‌ క్రైంలో ఫిర్యాదు చేశా."


"చాలా మంది కథానాయికలు చిత్ర పరిశ్రమలో లైంగిక పరమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు. దానిపై బాహాటంగా ఆరోపణలు చేసినప్పటికీ నాకు మద్దతు దక్కలేదు. ఇప్పుడు తమిళ ప్రజలు ఆదరిస్తున్నారు. త్వరలోనే ఇక్కడ రాజకీయ ప్రవేశం చేయనున్నా. తమిళ ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నా. నేను తప్పులు చేశా. ప్రస్తుతం వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తున్నా. అవకాశాల కోసం పలు తప్పులు చేశా. ఇకపై అలా జరగవని" పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: