టిక్టాక్, ఈరోజుల్లో పరిచయం అక్కర్లేని పేరు చిన్న పిల్లల నుంచి పండు ముసలి వరకు
టిక్టాక్ లో వీడియోస్ చేస్తున్నారు. భారత దేశం లో ఈ యాప్ ను వినియోగిస్తున్న వారి సంఖ్య 50 లక్షలు కు పై మాటే, ఈ ఒక్క మాట తో
టిక్టాక్ ఎంత ప్రసిద్దో చెప్పొచ్చు. సామాన్యులే కాదు సినీ స్టార్స్ కూడా
టిక్టాక్ లో మేమే తక్కువ తినలేదు అంటూ వీడియోస్ తో రెచ్చిపోతున్నారు. దీనికి బాలీవుడ్ సెలబ్రిటీలేమీ అతీతులు కాలేదు. బాలీవుడ్ స్టార్స్ మాధురీ దీక్షిత్, షాహిద్ కపూర్, సన్నీ లియోని, రితేష్ దేశ్ముఖ్ తదితరులు
టిక్టాక్ వేదికగా అభిమానులకు మరింత చేరువగా ఉంటున్నారు. డైలాగ్లకు లిప్సింక్ చూస్తూ, పాటలకు డ్యాన్స్ చేస్తూ అభిమానులకు వినోదం పంచుతున్నారు.
బాలీవుడ్ 'కబీర్ సింగ్'
షాహిద్ కపూర్ హీరో షాహిద్ కపూర్ టిక్టాక్లో ఇప్పటి వరకు ఆరు
టిక్టాక్ వీడియోలను షేర్ చేశారు. ఆయన్ను 6.2 లక్షల మంది ఫాలో అవుతున్నారు. 8 లక్షల మంది ఆయన ప్రొఫైల్ను లైక్ చేశారు. నటి యామీ గౌతమ్తో కలిసి చేసిన
టిక్టాక్ వీడియోను తాజాగా షాహిద్ షేర్ చేశారు. దీనిలో వారు
సినిమా డైలాగ్ చెబుతూ కనిపించారు.
అందాల
భామ సన్నీ లియోనిని టిక్టాక్లో 1.4 మిలియన్ మంది ఫాలో అవుతున్నారు. ఆమె ప్రొఫైల్ను 5.9 మిలియన్ల మంది లైక్ చేశారు. సన్నీ మిలిగిన స్టార్స్తో పోల్చితే టిక్టాక్లో చాలా చురుకుగా ఉంటున్నారు. తరచూ వీడియోలను షేర్ చేస్తున్నారు. అవి ఫాలోవర్స్ను అలరిస్తున్నాయి.
కథానాయకుడు రితేష్ దేశ్ముఖ్ అందరు స్టార్స్కన్నా అత్యధిక వీడియోలను టిక్టాక్లో పంచుకున్నారు. దాదాపు 30 వీడియోలతో 6 మిలియన్ ఫాలోవర్స్ను సొంతం చేసుకున్నారు. ఆయన ప్రొఫైల్ను 42.8 మిలియన్ల మంది లైక్ చేయడం విశేషం. సతీమణి జెనీలియా, ఇద్దరు పిల్లలతో కలిసి తీసుకున్న వీడియోలు, సహనటులతో కలిసి తీసుకున్న వీడియోలను ఆయన షేర్ చేస్తూ ఉంటారు.
బాలీవుడ్
తార మాధురీ దీక్షిత్ ఇటీవల టిక్టాక్లో చేరారు. ఆమె ఖాతా ప్రారంభించిన కొన్ని రోజులే అవుతున్నా.. అప్పుడే 8 లక్షల మంది ఫాలో అవుతున్నారు. ఆమె ప్రొఫైల్ను 1.7 మిలియన్ల మంది లైక్ చేశారు. ఇప్పటి వరకు ఆమె కేవలం రెండు వీడియోలు మాత్రమే షేర్ చేశారు. ఆ రెండింటినీ 10 మిలియన్ల మందికిపైగా వీక్షించడం విశేషం.