సంచలన నటి నయనతారను అగ్రనటి అని, లేడీసూపర్‌స్టార్‌ అని పిలుస్తుంటారు. ఈమే నటనకు ఫిదా అవ్వని అభిమానులంటు ఎవ్వరు వుండరు .ఇటీవల విజయ్‌తో బిగిల్‌ చిత్రంలో నటించి పెద్ద  హిట్‌ను తన సొంతం  చేసుకుంది ఈ ముద్దుగుమ్మా . నయనతార ప్రస్తుతం దర్బార్ చిత్రంలో రజనీకాంత్‌తో జతకట్టినది . ఈమే దర్బార్‌ చిత్ర రిజల్ట్‌ కోసం ఎదురుచూస్తోంది.  సంక్రాంతికి ఈ చిత్రం విడుదల కానుంది.

తాజాగా తన ప్రియుడు, దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌ నిర్మాతగా మారి నిర్మిస్తున్న నెట్రికన్‌ చిత్రంలో నటిస్తోంది. ఇది హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ కథా చిత్రం కావడం ఒక విశేషం. కాగా ఏ మాత్రం గ్యాప్‌ దొరికినా తన ప్రియుడిని తీసుకుని విదేశాల్లో విహరించేస్తుంటుంది. తన పుట్టినరోజు అయినా, తన ప్రియుడి పుట్టినరోజు అయినా ఈ జంట విదేశాలకు వెళ్తారు .


తాజాగా ఎవరి పుట్టినరోజు వేడుకకాకపోయినా వీరిద్దరూ అమెరికాకు వెళ్లి ఎంజాయ్‌ చేస్తున్నారు. అలా అక్కడ బాలీవుడ్‌ నిర్మాత, నటి శ్రీదేవి భర్త బోనీకపూర్‌ను ఈ జంట కలిశారు. అది యాదృచ్చిక కలయికా, లేక ప్లాన్‌ చేసుకున్న మీటింగ్‌నా అన్నది పక్కన పెడితే వీరి కలయికపై సామాజిక మాధ్యమాల్లో చర్చ జరుగుతోంది. వారు కలిసిన ఫొటో భారీగా  వైరల్‌ అవుతోంది. అక్కడ బోనీకపూర్‌తో పాటు ఆయన రెండవ కూతురు ఖుషీకపూర్‌ కూడా ఉంది. కాగా బోనీకపూర్‌ ఇటీవల తన నిర్మాణ సంస్థను కోలీవుడ్‌కు విస్తరించి, అజిత్‌ హీరోగా నేర్కొండ పార్వై చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. అదేవిధంగా అజిత్‌తో మరో చిత్రాన్ని నిర్మించడానికి రెడీ అయ్యారు. నేర్కొండ పార్వై చిత్రం ఫేమ్‌ హెచ్‌.వినోద్‌నే ఈ చిత్రాన్ని  తెరకెక్కించనున్నారు. చిత్ర షూటింగ్‌ డిసెంబరులో మొదలవుతుందనే ప్రచారం జరుగుతోంది.


ప్రస్తుతం చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్స్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందులో హీరోయిన్ గా  నయనతార నటించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.  బోనీకపూర్, నయనతారల అమెరికా కలయిక  ఈ  చిత్రంలో భాగమేనా అనే ప్రశ్నకు ఆస్కారం కలిగిస్తోంది.పూర్తి వివరాలు తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే.ప్రస్తుతం  నయనతార తన ప్రియుడు విఘ్నేశ్‌శివన్‌నిర్మాత బోనీకపూర్, ఆయన కూతురు ఖుషీ కపూర్‌లతో కలిసి అమెరికాలో డిన్నర్‌ చేశారన్న వార్త సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు బాగా  వైరల్‌ అవుతోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: