బాలీవుడ్లో స్వీట్ అండ్ హాట్ కపుల్ రణవీర్ సింగ్ దీపికా పదుకొనే. ఎంతో కాలం పాటు ప్రేమలో మునిగితేలిన ఈ జంట డెస్టినేషన్ వెడ్డింగ్స్ ద్వారా ఒకటయ్యారు. అయితే పెళ్లి తర్వాత ఈ ఇద్దరికీ ఇంకా ఫేమ్ పెరిగిపోయిందనె చెప్పాలి. పెళ్లి తర్వాత ఏ ఈవెంట్ కీ వెళ్ళిన ఏ ఫంక్షన్ కు వీరిద్దరే సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా మారిపోయారు . ఇక వీరిద్దరి మధ్య ఉన్న ప్రేమను చూసి చాలామంది కుళ్లుకుంటారు కూడా. అయితే బాలీవుడ్ అభిమానులందరూ వీరిద్దరికీ దీప్వీర్ అనే నిక్ నేమ్ కూడా పెట్టుకున్నారు. ఎక్కడ కనిపించినా దీప్ వీర్ అనే పేరుతో పిలుస్తుంటారు .పెళ్లి తర్వాత కూడా ఎవరికివారు సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నారు. అయితే రణవీర్ ప్రస్తుతం కపిల్ దేవ్ బయోగ్రఫీ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలు కపిల్ దేవ్ భార్య పాత్రలో రణవీర్ సింగ్ సరసన రియల్ లైఫ్ సతీమణి దీపికా పదుకొనే నటిస్తున్నారు. అయితే ఈ సినిమా అభిమానులందరికీ పండగనే చెప్పాలి.
ఎందుకంటే రణవీర్ సింగ్ దీపికా పదుకొనే జంటను చూసి అభిమానులు తెగ మురిసిపోతుంటారు. రియల్ లైఫ్ వైఫ్ అండ్ హస్బెండ్ రిల్ లైఫ్ లో కూడా ప్రేక్షకులను వైఫ్ అండ్ హస్బెండ్ గా అలరించబోతున్నాడు ఈ సినిమా కోసం తెగ సంబర పడిపోతున్నారు అభిమానులు . అయితే ఈ జంట డెస్టినేషన్ వెడ్డింగ్స్ ద్వారా ఒక్కటయ్యి ఇంతలోనే సంవత్సరం గడిచిపోయింది. తాజాగా ఈ జంట తమ మొదటి వెడ్డింగ్ అనివర్సరీ ఘనంగా జరుపుకున్నారు. బాలీవుడ్ హాట్ కపుల్ గా పేరు తెచ్చుకున్న దీప్ వీర్ జంట తిరుమల స్వామివారిని దర్శించుకున్నారు. మొదటి పెళ్లి రోజు సందర్భంగా తిరుమల తిరుపతి లో వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం తీసుకున్నారు ఈ జంట.
ఆ తర్వాత అమృత్ సర్ లోని స్వర్ణ దేవాలయంలో కూడా గురుద్వార్ ను కూడా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ జంట . అయితే తిరుమల తిరుపతి దేవస్థానంలో వీరిద్దరి పర్యటన సమయంలో చిలిపి ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది. తిరుమలలో ఈ జంట పర్యటిస్తూన్న సందర్బంగా దీపిక మేడం ఐ లవ్ యు అంటూ తెలిపాడు . ఇక ఆ తర్వాత పక్కనే ఉన్న ఆమె భర్త రణవీర్ కు కూడా ఐ లవ్ యు భయ్యా అంటూ అభిమాని చెప్పాడు. దీపిక పడుకునే వెంటనే కలుగజేసుకుని చమత్కారంగా బట్ యూ లవ్ మీ మోర్ అంటూ తెలిపింది.దీంతో ఇద్దరు భార్య భర్తల తో పాటు పక్కనె ఉన్న వాళ్ళందరూ నవ్వారు . ప్రస్తుతం క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ బయోగ్రఫీ 83 అనే చిత్రంలో నటిస్తున్నారు ఈ జంట. కాగా ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కాదు.