ఇటివల తెలుగులో సంచలనం సృష్టించిన బిగ్ బాస్ రియాలిటీ షోను ప్రేక్షకులు అంత తేలికగా మర్చిపోలేరు. గత రెండు సీజన్ల కంటే బిగ్ బాస్ 3 సీజన్ స్మాల్ స్క్రీన్ పై భారీ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. కంటెస్టెంట్స్ పరంగా కానీ, హోస్టింగ్ పరంగా కానీ, టీఆర్పీ రేటింగ్స్ పరంగా కానీ మూడో సీజన్ టాప్ లో నిలిచింది. ఈ సీజన్ పార్టిసిపెంట్స్ తమ అనుభవాలను, జ్ఞాపకాలను మరచిపోలేక పోతున్నారు. దీంతో అంతా కలిసి రీయూనియన్ పార్టీ చేసుకుని ఎంజాయ్ చేశారు.

 


ఈ రీయూనియన్ పార్టీకి కొంతమంది హాజరుకాలేక పోయినా వచ్చిన వారందరూ సరదాగా ఎంజాయ్ చేశారు. హైదరాబాద్ లోని ఓ రిక్రియేషన్ క్లబ్ లో వారంతా సందడి చేశారు. ఆలీ రెజా ఫ్యామిలీతో సహా వచ్చాడు. మహేశ్ విట్టా, పునర్నవి, వరుణ్ సందేశ్, వితికా షేరు, హిమజ.. ఈ పార్టీకి హాజరై ఎంజాయ్ చేశారు. బాబా భాస్కర్, శివజ్యోతి, రాహువ్ సిల్పిగంజ్ ఈ పార్టీకి హాజరు కాలేదు. వరుణ్ సందేశ్ – వితిక జంట ఈ రీయునియన్ పార్టీ అరేంజ్ చేసినట్టు సమాచారం. అందరికీ ఇన్విటేషన్స్ పంపినా కూడా కొందరు తమ బిజీ షెడ్యూల్స్ కారణంగా హాజరుకాలేదని తెలుస్తోంది. డిఫరెంట్ డ్రెస్సింగ్ తో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.

 


కొందరు మ్యూజిక్ ఎంజాయ్ చేస్తే మరికొందరు స్విమ్మింగ్ పూల్ లో ఆటపాటలతో సందడి చేశారు. బిగ్ బాస్ 3 సీజన్ లో వారు పడిన గొడవలు, వాళ్ల టాస్క్ లు గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి. ఫైనల్ ఎపిసోడ్ కి మెగాస్టార్ చిరంజీవి రావడం సీజన్ కు హైలైట్ గా నిలవడమే కాకుండా టీఆర్పీ పరంగా టాప్ లో నిలిచింది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: