రష్మిక మందన్న తన అందం అభినయంతో టాలీవుడ్ ఇండస్ట్రీ ని రాణిస్తుంది. చలో సినిమా ద్వారా తెలుగు లో అరంగేట్రం చేసిన ఈ కన్నడ పిల్ల వరుస బ్లాక్ బస్టర్ సినిమాలతో దూసుకుపోతుంది. డియర్ కామ్రేడ్ సినిమాలోని లిల్లీ పాత్ర చేసిన ఈమె తెలుగు సినీ అభిమానులను ఫిదా చేసింది. ప్రస్తుతం ఆమె మహేష్ బాబుకి జంటగా 'సరిలేరు నీకెవ్వరు',... అల్లు అర్జున్ సరసన 'అలా వైకుంఠపురములో',.. నితిన్ తో కలిసి భీష్మ సినిమాల్లో నటిస్తుంది.


తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా కార్తీ సరసన 'సుల్తాన్' చిత్రంలో నటిస్తుంది. ఇంత బిజీగా ఉన్న రష్మిక ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నది. ఈ సందర్భంగా తన గురించి ఎన్నో విషయాలను చెప్పుకొచ్చింది. "నాకు ఇప్పుడు చాలా సినీ అవకాశాలు వస్తున్నాయి.. ప్రముఖ హీరోలతో నటిస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. 


ఎంత పెద్ద స్టార్ హీరోలతో నేను నటించినా.. నాకు మాత్రం అస్సలు గర్వం ఉండదు.. నిరాడంబరంగా అనే ఉంటాను," అని రష్మిక చెప్పింది. ఇంకా చెబుతూ.. " నాకు అలంకారాలు ఆడంబరాలు అస్సలు నచ్చవు. సినిమాల్లో అందంగా కనిపించడం కోసం అవన్నీ అవసరం కానీ నిజ జీవితంలో అవసరం లేదు కదా! మేకప్ వేసుకోవడమంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. నాకు సహజంగా ఉండటం అంటేనే ఇష్టం. సినిమా షూటింగులకు వెళ్ళినప్పుడు మాత్రమే నేను మేకప్ వేసుకుంటాను. ఎప్పుడైనా బయటికి వెళ్ళినా నేను మేకప్ లేకుండానే వెళ్తాను." అని రష్మిక చెప్పింది. 


ఇంకా చెప్పాలంటే.. అవకాశాలు వస్తున్నాయి కదా అంటూ అన్నీ సినిమాలు చేయనంటుంది రష్మిక. ఏదైనా సినిమా చేస్తానని ఒప్పుకుంటే ఆ సినిమాకి 100 పర్సెంట్ న్యాయం చేస్తానని ఈ కన్నడ ముద్దుగుమ్మ చెప్పుకొచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: