శ్రీరెడ్డి ఎక్కడికెళ్లినా ఏం చేసినా అది సంతోషంగా మారిపోతాయి. కాస్టింగ్ కౌచ్ పేరుతో ఇప్పటికే టాలీవుడ్లో ప్రముఖులను తీవ్ర కామెంట్లో చేసిన శ్రీరెడ్డి సంచలనం సృష్టించింది. ఇప్పటికే ఎంతోమంది ప్రముఖులపై సంచలన కామెంట్స్ చేసింది శ్రీరెడ్డి . కరుణానిధి మనవడు ఉదయనిధి స్టాలిన్ పై కూడా సంచలన కామెంట్ చేసి మంట పుట్టింది ఈ వివాదాల ముద్దుగుమ్మ . దీంతో తమిళ అభిమానులు అందరూ తమిళనాడు లో అడుగుపెడితే చంపేస్తాం అంటూ శ్రీరెడ్డికి గట్టి వార్నింగ్ కూడా ఇచ్చారు. శ్రీరెడ్డి సినిమాల్లో కంటే వివాదాలతోనే ఎక్కువగా పాపులర్ అయింది. ఇక ఈ అమ్మడుకి సినిమాలకంటే వివాదాలే ఎక్కువగా ఉన్నాయి .అయితే తాజాగా శ్రీ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించింది. ఆమె పెట్టిన వైరల్ అవుతున్న పోస్టులన్నీ తప్పుజరిగింది అంటూ శ్రీరెడ్డి తెలిపింది. ఇవన్నీ తప్పుడు వార్తలు అంటూ స్పష్టం చేస్తోంది. అది తన ఫేస్బుక్ అకౌంట్ కాదని వేరే వాళ్లు ఫెక్ ఫేస్ బుక్ అకౌంట్ తో ఈ కామెంట్ చేశారు అంటూ శ్రీరెడ్డి అపాలజీ చెప్పింది .అంతే కాకుండా భవిష్యత్తులో ఇలాంటివి జరగవు అంటూ క్లారిటీ ఇచ్చింది. అసలు ఉదయనిది స్టాలిన్ ను తాను ఇప్పటివరకు కలిసింది కూడా లేదంటూ తేల్చి చెప్పింది.
అంతేకాదండోయ్ ఈ సందర్భంగా మరో విషయాన్ని కూడా చెప్పింది సంచలనాలు సుందరి . ఎవరో తన పేరును బ్యాడ్ చేయాలనే ఇలా చేశారు అంటూ శ్రీ రెడ్డి తెలిపింది . ఇక తమిళ ప్రజలు తనను ఎంతగానో ఆరాధిస్తున్నారు శ్రీరెడ్డి తెలిపింది. అంతేకాదండోయ్ త్వరలోనే ఒక ప్రముఖ రాజకీయపార్టీ ద్వారా రాజకీయ ప్రవేశం చేస్తానని శ్రీ రెడ్డి మీడియా సమావేశంలో తెలిపారు. తమిళనాడు ప్రజలకు తన వంతు సాయంగా ఎంతో కొంత సేవ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సెన్సేషనల్ శ్రీరెడ్డి తెలిపింది. తాను త్వరలోనే రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నాను అంటూ క్లారిటీ ఇచ్చేసింది. ఈ క్రమంలోనే ఉదయనిధి స్టాలిన్ తో గొడవలు ఎందుకని శ్రీరెడ్డి ఆపాలజీ చెప్పినట్లు అందరు అనుకుంటున్నారు.
ఈ సెన్సేషనల్ సుందరి శ్రీ రెడ్డి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ ప్రముఖ పార్టీ తరఫున టికెట్ సంపాదించబోతుంది అని ప్రస్తుతం చర్చ మొదలైంది. ఏ పార్టీ నుంచి ఎక్కడ పోటీ చేస్తాను అనేది త్వరలోనే వెల్లడిస్తానని శ్రీ రెడ్డి తెలిపారు. చాన్సుల కోసం తాను తప్పు చేశానని కానీ అవి రిపీట్ చేయకుండా చూసుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చింది. మొత్తానికి శ్రీ రెడ్డికి అసెంబ్లీ టికెట్ ఇవ్వబోతున్న పార్టీ ఏదో మాత్రం త్వరలో తేలిపోనుంది అని అర్థమైంది. ఇప్పటికీ సినిమాల్లో ప్రముఖులపై కామెంట్ చేసి ఓ రేంజులో రచ్చ చేసిన శ్రీ రెడ్డి రాజకీయాలకు వెళ్ళిన తర్వాత ఎలాంటి పరిస్థితులను క్రియేట్ చేస్తుంది అనేది మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.