మామూలుగా సెలెబ్రెటీలు అంటే అభిమానుల పోటీలకు క్లిక్ మనిపిస్తూ హవాను కొనసాగిస్తారు.. అలాంటి వారు మరొక సెలబ్రేటితో ఫోటో దిగడానికి చాలా మక్కువ చూపిస్తారు.. సినీ ఇంస్ట్రీలో రోజు ఈ మాటలు ఎక్కువగా వినపడుతున్నాయి..అలానే ఇప్పుడు ఎక్కువ జరుగుతున్నాయి..తాజాగా ఓ ఘటన చోటు చేసుకుంది..హాలీవుడ్ అంతర్జాతీయ పాప్ సింగర్ కు కరణ్ జోహార్ ఘ స్వాగతం చేశాడు..ఆ కార్యక్రమానికి బాలీవుడ్ సినీ తారలు..సినీ ప్రముఖులు హాజయ్యారు...

హాలీవుడ్‌ పాప్‌ సింగర్‌ క్యాటీ పెర్రీ ఇండియా టూర్‌కు విచ్చేసింది. అందులో భాగంగా శనివారం ముంబైలో జరిగిన లైవ్‌ కాన్సెర్ట్‌(సంగీత కచేరీ)కు ఆమె హాజరైంది. అంతే ఆమెను చూడాడానికి ఫ్యాన్స్ కు పలు ప్రాంతాల నుండి గుంపులు గుంపులుగా రావడం జరిగింది. మాములుగా మన సెలబ్రిటీస్ ని చూస్తేనే జనం ఆగలేరు, అటువంటిది హాలీవుడ్ సింగర్ రావడంతో జనాల తాకిడి మరింత ఎక్కువ అయింది. 

ఇక ఆ కార్యక్రమానికి అతిథులుగా బాలీవుడ్‌ నటులు రణబీర్‌ కపూర్‌, రణవీర్‌ సింగ్‌, దీపికా పదుకునే హాజరయ్యారు2012లో ఐపీఎల్‌ ప్రారంభోత్సవానికిగానూ అమెరికన్‌ స్టార్‌ క్యాటీ పెర్రీ ముంబైలో ప్రదర్శన ఇచ్చింది. అనంతరం ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ముంబైలో అడుగు పెట్టింది. ఆమె కోసం దర్శక, నిర్మాత కరణ్ జోహార్ విందును ఏర్పాటు చేశారు..

ఈ విందుకు పలువురు సినీ నటులు హాజరయ్యారు..కాగా,ప్రముఖ కమెడియన్‌, నటుడు సునీల్‌ గ్రోవర్‌ మాత్రం పార్టీకి వెళ్లలేకపోయాడు. కానీ అతను మాత్రం క్యాటీ పెర్రీను కలిసానంటున్నాడు. ఫొటోషాప్‌ సాయంతో క్యాటీ పెర్రీతో సునీల్‌ కలిసి ఉన్న ఫొటోను ఇన్‌స్టాలో షేర్‌ చేశాడు. ‘నేను కూడా క్యాటీ పెర్రీతో ఉన్నాను..’ అంటూ కామెంట్‌ జోడించి హాస్యాన్ని చాటుకున్నాడు. ఇక కామెడీ నైట్స్‌ విత్‌ కపిల్‌ షోతో సునీల్‌ గ్రోవర్‌ మంచి కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత పలు టీవీషోల్లోనూ మెరిసాడు..ప్రస్తుతం మరి కొన్ని సినిమాలలో నటిస్తున్నారు..కాగా వారు క్యాటీతో కలిసి దిగిన ఫోటోలు ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: