ప్రముఖ బ్యాడ్మింటన్ క్రిడాకారిణి సైనా నెహ్వాల్  జీవిత చరిత్ర ఆధారంగా సినిమా రూపొందుతున్న విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమా కి మొదటి నుండి అనేక ఆటంకాలు చుట్టూ ముడుతున్నాయి. ఈ సినిమా హీరోయిన్ విషయంలో చాలా పెద్ద చర్చ జరిగింది. మొదట బాలీవుడ్ నటి శ్రద్దకపూర్ నటిస్తుందని వార్తలు వచ్చాయి ఆ తరువాత సమంత నటిస్తుందని వార్తలు వచ్చాయి కానీ చివరికి ఈ సినిమా లో ప్రముఖ   బాలీవుడ్ నటి పరిణితి చోప్రా  నటిస్తుందని చిత్ర నిర్మాణ సంస్థ అఫీషియల్ గా ప్రకటించింది.


సినిమా కోసం పరిణితి చోప్రా చాలా కష్టపడుతుంది. ఆమె ఈ సినిమా కోసం  చాలా బరువు కూడా తగ్గింది. గత కొన్ని రోజులుగా ఆమె  బ్యాడ్మింటన్ లో   శిక్షణ తీసుకుంటుంది. పతిణితి చోప్రా  రోజులో ఎక్కవ సమయం బ్యాడ్మింటన్  ప్రాక్టీస్ చేస్తుంది. ఈ క్రమంలో  బ్యాడ్మింటన్  ఆడుతుండగా పరిణితి చోప్రా గాయపడ్డారు. .ఆమె  మెడ వెనుక భాగం ఫోటో ను ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నారు. నేను మరియు చిత్ర యూనిట్ చాలా జాగ్రత్తలు తీసుకున్నాం . కానీ అనుకోకుండా గాయపడ్డాను. తగినంత విశ్రాంతి తీసుకోని మళ్ళీ బ్యాడ్మింటన్ శిక్షణ మొదలుపెడుతాను అని ఆమె ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.


మరో నెల రోజుల్లో ఈ సినిమా షూటింగ్ మొదలవనుంది ఇలాంటి సమయంలో పరిణితి చోప్రా గాయపడటంతో సినిమా షూటింగ్ ఆలస్యం కావచ్చు అని టాక్ వినబడుతుంది. ఈ సినిమా ను ప్రముఖ రచయిత, దర్శకుడు  అమోల్ గుప్తా దర్శకత్వం వహించనున్నాడు. అమోల్ గుప్తా దర్శకత్వం వహించిన అన్ని సినిమాలు మంచి  విజయాలు సాధించాయి.  ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్ నటుడు  పరేష్ రావల్ మరియు మానవ్ కౌల్  లు కీలక పాత్రల్లో నటించనున్నారు. ఈ సినిమాను 2020 లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: