టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. గత ఏడాది వచ్చిన భరత్ అనే నేను, అలానే ఈ ఏడాది వచ్చిన మహర్షి సినిమాలు సూపర్ డూపర్ హిట్ కొట్టి ఆయనకు కెరీర్ పరంగా మంచి జోష్ ని అందించాయి. ఇక ప్రస్తుతం ఆయన నటిస్తున్న తాజా సినిమా సరిలేరు నీకెవ్వరు. మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను మంచి మాస్, కమర్షియల్ ఎంటర్టైనర్ గా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నారు. రాబోయే సంక్రాతి కానుకగా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై సూపర్ స్టార్ ఫ్యాన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే వరుసగా రెండు సక్సెస్ లు అందుకున్న సూపర్ స్టార్, తప్పకుండా ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టి తీరుతారని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే టాలీవుడ్ లో క్రేజ్, పాపులారిటీ పరంగా అందనంత ఎత్తులో ఉన్న సూపర్ స్టార్ కు బాలీవుడ్ లో కూడా విపరీతమైన క్రేజ్ ఉంది. 

అక్కడి హీరోయిన్స్ లో సూపర్ స్టార్ కు ఫ్యాన్స్ ఉండడం విశేషం. ఇక మహేష్ బాబుకు ఎప్పటినుండో బాలీవుడ్ అవకాశాలు వస్తున్నప్పటికీ ఆయన మాత్రం వాటిని చేయడానికి సుముఖత వ్యక్తం చేయడం లేదు. ఇక్కడే ఉండి తెలుగు సినిమాల ద్వారా ప్రేక్షకులకు వినోదాన్ని అందించాలని భావించే సూపర్ స్టార్, బాలీవుడ్ కి వెళ్లి తన టైం వేస్ట్ చేసుకోవడం ఇష్టం లేదని ఇప్పటికే పలుమార్లు చెప్పడం జరిగింది. అయితే ఆయన భార్య నమ్రతను కొందరు బాలీవుడ్ బడా నిర్మాతలు మరియు దర్శకులు, మహేష్ బాలీవుడ్ ఎంట్రీ కోసం కొద్దిరోజులుగా ఒత్తిడి చేస్తున్నట్లు టాక్. మరోవైపు ఆయన ఫ్యాన్స్ కూడా ఎప్పటి నుండో తమ హీరో ఒక్క బాలీవుడ్ సినిమాలో నటిస్తే చూడాలని ఎంతో ఉబలాటపడుతున్నారు. ఈ నేపథ్యంలో, 

నేడు ఒక ప్రముఖ తెలుగు ఎంటర్టైన్మెంట్ వెబ్ సైట్ నిర్వహించిన ఒపీనియన్ పోల్ లో భాగంగా, మహేష్ బాబు ఒక పాన్ ఇండియా మూవీ చేస్తే చూడాలని ఆశపడుతున్నట్లు మెజారిటీ ప్రేక్షకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ పోల్ రిజల్ట్స్ పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. సో, దీనిని బట్టి ఇప్పటివరకు బాలీవుడ్ సినిమా చేయకూడదని వెనకడుగు వేస్తూ వెళ్తున్న మహేష్, ఇక తప్పించుకోవడానికి వీల్లేదని, తప్పనిసరిగా ఫ్యాన్స్ సహా ప్రేక్షకులు కూడా కోరుతున్నట్లు ఒక మంచి పాన్ ఇండియా మూవీ చేయాల్సిందే అని అంటున్నారు సినీ విశ్లేషకులు. మరి మహేష్ ఇకనైనా ఫ్యాన్స్ కోసం తన అభిప్రాయాన్ని మార్చుకుంటారో లేదో చూడాలి. కాగా కొద్దిరోజుల క్రితం నుండి మహేష్, కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో ఒక పాన్ ఇండియా రాబోతోంది అంటూ వార్తలు వస్తున్నాయి. ఇదే కనుక నిజం అయితే, సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి ఇది మంచి పండుగ వార్తే అని చెప్పాలి.....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: