జబర్దస్త్ కామెడీ షో.. ఇప్పుడు ఎక్కడ చూసినా దీని గురించే చర్చ. ఇంట్లో పెద్దవాళ్ల నుంచి పిల్లల వరకూ ప్రతి ఒక్కరినీ కడుపుబ్బా నవ్వించే జబర్దస్త్ చాలా ఫేమస్ అయ్యింది. హాస్పిటల్ లో రోగులకు చికిత్స అందించే వైద్యులే జబర్దస్త్ కామెడీ షో చూడాలని చెప్పి చాలా మందికి సలహాలు ఇచ్చిన సంఘటనలు కూడా కోకొల్లలుగా ఉన్నాయి. తెలుగు ప్రజలను ఇంతలా ఆకట్టుకున్న జబర్దస్త్ షోలో ఇప్పుడు చీలికలు ఏర్పడ్డాయనే వార్తలు వినిపిస్తున్నాయి. కొన్ని వార్తలు జబర్ధస్త్ అభిమానులను నిరాశలోకి నెడుతున్నాయి. ఇంతకీ జబర్దస్త్ షోలో ఏం జరుగుంటుంది? ఎందుకు ఈ  వార్తలన్నీ వైరల్ అవుతున్నాయన్నే సందేహం అందరిలోనూ నాటుకుపోయింది. వాస్తవం ఏంటో తెలియక చాలా మంది బాధపడుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇంతకీ జబర్ధస్త్ కామెడీ షోలో సమస్యలేంటి?


         జబర్దస్త్ కామెడీ షో నుంచి కొందరు టీం లీడర్స్‌తో పాటు నాగబాబు కూడా వెళ్లిపోతున్నాడు.. గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్న వార్త ఇది. అసలు జబర్దస్త్ మొదలైందే నాగబాబు, రోజా నవ్వులతో.. వాళ్లు లేకుండా షో నడిపిస్తారా అనేది అతిపెద్ద అనుమానం ఇప్పుడు. అయితే అలాంటిదేం లేదు.. కచ్చితంగా జబర్దస్త్ ఉంటుంది.. నాగబాబు ఉంటాడంటూ మల్లెమాల ప్రొడక్షన్స్ కూడా చెబుతోంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం మరోలా వార్తలొస్తున్నాయి. నాగబాబుతో పాటు హైపర్ ఆది, చమ్మక్ చంద్ర, సుడిగాలి సుధీర్ లాంటి టీమ్స్ కూడా జబర్దస్త్ నుంచి మానేసి వెళ్లిపోతున్నారని దీని సారాంశం. 


జబర్దస్త్ కామెడీ షోకు పోటీగా జీ తెలుగులో మరో భారీ కామెడీ షో ప్లాన్ చేస్తున్నారని.. అందులోకి ఈ టీమ్స్‌తో పాటు నాగబాబును కూడా భారీ రెమ్యునరేషన్ ఇచ్చి తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతున్న వేళ ఇప్పుడు ఓ సంచలన ప్రోమో విడుదలైంది. ఇప్పటి వరకు ఈటీవీకి మాత్రమే పరిమితమైన నాగబాబు.. ఉన్నట్లుండి జీ తెలుగులో దర్శనమిచ్చాడు. ఆయనతో పాటు ప్రదీప్ కూడా చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చాడు. ఇక జబర్దస్త్ నుంచి నాగబాబు బయటికి వచ్చినట్లే.. పటాస్ షో నుంచి యాంకర్ రవి కూడా బయటికి వస్తున్నాడని ప్రచారం జరుగుతోంది.

ఇప్పుడు జీలో మొదలైన ఈ ప్రోమోలో నాగబాబుతో పాటు రవి కూడా ఉన్నాడు. నవంబర్ 24 నుంచి సర్ సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అనే కార్యక్రమం మొదలవనుంది. ఇదంతా చూస్తుంటే నిజంగానే జబర్దస్త్ కామెడీ షో ఆగిపోనుందేమో అనే అనుమానాలు బలపడుతున్నాయి. మరి దీనిపై ఎవరొచ్చి క్లారిటీ ఇస్తారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: