సినిమా ఇండస్ట్రీలో పార్టీల కల్చర్ తెలిసిందే. పుట్టినరోజులతో పాటు కేక్ కటింగ్ కార్యక్రమాల సెలబ్రేషన్స్ ఎప్పుడు చూస్తున్నదే. ఇక స్టార్స్ పుట్టినరోజులకు అభిమానులు కేక్ లు కట్ చేయడం.. భారీగా కటౌట్లు కట్టి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం వంటి తతంగాలు చూస్తూనే ఉంటాం. ఇటీవల ఓ ఇద్దరు స్టార్ హీరోల కోసం భీమవరంలో ఊరంతా ఫ్లెక్సీలు కట్టి గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. కిలోమీటరు పొడవు గోడల్ని పోస్టర్ల ను అంటించి షాకిచ్చారు. 

ఈ సందడి గొడవేమో కానీ టాలీవుడ్ కి బాగా తెలిసిన 'కిచ్చా సుదీప్' మాత్రం ఇలాంటి వాటికి పూర్తిగా వ్యతిరేకం అంటున్నాడు. ఈ హంగులు ఆర్భాటాలు తనకు ఎంత మాత్రం నచ్చవని షాకిచ్చాడు. అంతేకాదు పుట్టినరోజులు జరుపుకోవడం మానేశానని తెలిపాడు. ఇక కేవలం రూ.200 ఖరీదు చేసే టీషర్టు అయినా తొడుక్కుంటానని ఖరీదైన బట్టలు కావాలని అనుకోనని తెలిపారు. ఒకప్పటిలా ఇప్పుడు కూడా చేయలేనని అన్నారు. అభిమానులు సైతం ఇలాంటి వాటికి అనవసరంగా ఖర్చు చేయకుండా అలా ఖర్చు చేసే డబ్బు తో మంచి పనులు చేయాలని సూచించాడు. ఇక స్టార్ల బర్త్ డేలకు హంగామా అవసరం లేదని అన్నాడు.

అయితే సుదీప్ పుట్టినరోజు జరుపుకోకపోవడానికి ఒక చిన్నారి కారణమట. ఇంతకుముందు తాను ఓ బర్త్ డే వేళ లగ్జరీ పార్టీ చేసుకున్నానని పార్టీ అంతా అయ్యి వెళ్లిపోతుంటే .. కింద పడి ఉన్న కేక్ తీసుకుని తింటున్న చిన్నారి కంట పడిందని .. ఆ తర్వాత తాను పూర్తిగా మారిపోయానని చెప్పారు. ఇక పుట్టినరోజులు మానేసిన వేరొక స్టార్ గురించి ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. తెలుగమ్మాయి .. అందాల హీరోయిన్ రాశీ సైతం నిరంతరం పుట్టినరోజులు జరుపుకునేవారు. కానీ ఒకరోజు సడెన్ గా ఇక పుట్టినరోజుల్ని వదిలేశారు. అందుకు కారణం .. తన పుట్టినరోజుల్ని గ్రాండ్ గా జరిపించే నాన్న గారు చనిపోయారని అది కూడా తన పుట్టినరోజే ఆయన పోవడం తీవ్రంగా కలచివేసిందని అలీతో జాలీగా టాక్ షోలో తెలిపారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: