సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యేందుకు.. రష్మి, అనసూయల స్థాయిలో క్రేజ్ దక్కించుకునేందుకు తిప్పలు పడుతున్న శ్యామల.. అపుడెపుడో ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో ‘ఇండస్ట్రీ వాళ్లంటే చాలా మందికి తక్కువ చూపు ఉందని వాళ్లను పురుగుల్ని చూసినట్టు చూస్తా’ అంటూ శ్యామల చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇండస్ట్రీని చులకన చేసేవాళ్లపై మండిపడింది, అలాంటి వాళ్లను పురుగులతో పోల్చింది
 
ఇంతకీ శ్యామల ఏమి అందంటే.. ‘నువ్ పొద్దున్న లేస్తే ఎంటర్ టైన్మెంట్ కావాలి. నీకు ఇంట్లో టీవీ కావాలి. అందులో షోస్ కావాలి. అందులో గెలిస్తే ఆడవాళ్లకు గిఫ్ట్‌లు కావాలి. ఇవి చాలనట్టు మీకు మూవీలు కావాలి. ఇంత చేసి ఇండస్ట్రీ గురించి తక్కువ చేసి మాట్లాడటానికి అసలు నువ్ ఎవరివి? నీకు ఏం తెలుసు అని మాట్లాడుతున్నావ్.. ఇలాంటి వాళ్లంటే నాకు ఒళ్లు మంట’ అంటూ ఫైర్ అయ్యింది శ్యామల.
 
కొంతమంది అయితే బాగా చేశారని అభినందిస్తారని.. వాళ్లను చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుందన్నారు. యాంకర్ సుమ తరువాత హోమ్లీగా ట్రెడిషనల్గా  మా ఇంట్లో అమ్మాయిగా నువ్వే ఉంటావ్ శ్యామలా అంటూ చాలా మంది తనతో అన్నారని, ఆడవాళ్లే కాకుండా అంకుల్స్, కాలేజ్ స్టూడెంట్స్ కూడా చాలా పద్దతిగా ఉంటానని అభినందిస్తారు’ అంటూ చెప్పుకొచ్చింది శ్యామల. 


ఇక అందరు యాంకర్లు మాదిరే తనకు ఎక్స్ పోజింగ్ చేయాలని ఉన్నా తన ఫ్యాన్స్ కొంతమంది నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారని వాపోయింది శ్యామల. మోడ్రన్‌గా కనిపించాలని కాస్త ఎక్స్ పోజింగ్ ఉన్న డ్రెస్ వేసుకుని షో చేస్తే ఫేస్ బుక్‌లో వరుస కామెంట్స్ చేస్తున్నారు. మీరు కూడా మొదలుపెట్టేశారా? అని తిట్లు తిడుతున్నారు. నాకు మోడ్రన్‌గా ఉండాలన్నా వాళ్ల కోరిక మేరకు ఎక్స్ పోజింగ్‌కి దూరంగా ఉంటున్నా. సెలబ్రిటీ అయిన తరువాత నాలో చాలా ఛేంజెస్ వచ్చాయి. నాకు సపోర్ట్‌గా నా భర్త ఉన్నాడు కాబట్టి లైఫ్ ఇలా సాగిపోతుంది’ అంటూ తన అభిప్రాయాలను వ్యక్త పరిచింది శ్యామల. 


మరింత సమాచారం తెలుసుకోండి: