తాజాగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో  జనసేన ఘోర పరాజయం తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి వస్తున్నాడనే  టాక్ వినిపిస్తోంది. అయితే ఎన్నోసార్లు దీనిపై పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు. సినిమాల్లోకి రావడం లేదు  అంటూ తేల్చి చెప్పారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా ఉన్నాడు. ఇక ఇప్పుడు ఆయన సినిమాలు చేయబోతున్నాడు సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అంటూ వార్తలు  బాగానే హల్చల్ చేస్తున్నాయి. కానీ ఈ వార్తలపై మాత్రం ఇప్పటివరకు పవన్ క్లారిటీ ఇవ్వలేదు. తాను  సినిమా చేయబోతున్నాను  అంటూ ఎక్కడ ప్రకటించలేదు కూడా. అయితే ఈయన పింక్ రీమేక్ లో నటించబోతున్నాడు అంటూ కొన్ని రోజులుగా వార్తలు హల్చల్ చేసిన విషయం తెలిసిందే. అంతే కాకుండా దానికి దిల్ రాజు బోనికపూర్  నిర్మాతగా వ్యవహరిస్తున్నారు అంటూ  సాక్షాత్తు బాలీవుడ్ టాప్ క్రిటిక్  తరుణ్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు. గతంలో పవన్ కళ్యాణ్  సినిమాలో నటించ  బోతున్నారు అని అందరూ అనుకున్నారు. కానీ దీనిపై పవన్ కళ్యాణ్ మాత్రం నోరు విప్పడం లేదు. 

 

 

 

 ఇక తాజాగా బోనీ కపూర్ కూడా ఈ సినిమాపై ఓపెన్ అయిపోయాడు. పింక్ సినిమాలో  అమితాబచ్చన్ పాత్రలో పవన్ కళ్యాణ్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే సినిమాకి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించబోతున్నారు. కాగా వేణు శ్రీరామ్ కంటే ముందు సినిమా నిర్మాతలు హరీష్ శంకర్ ను సంప్రదించారని తెలుస్తోంది. అయితే ఇప్పటికే హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో గబ్బర్ సింగ్ వచ్చే సెన్సేషనల్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ కి హరీష్ శంకర్ వీరాభిమాని. కానీ పవన్ సినిమా అయినప్పటికీ  హరి శంకర్  సినిమా చేయను అంటూ మొహం మీద చెప్పేసిన్నట్లు సమాచారం. హరీష్ శంకర్ పవన్ కల్యాణ్ సినిమాకి నో చెప్పడానికి గల కారణాలు కూడా లేకపోలేదు.తన  అభిమాన నటుడైన  పవన్ కళ్యాణ్ సినిమాకి ఆఫర్ వచ్చినప్పటికీ కాదనడానికి కారణం ఈ సినిమా రీమేక్ కావడమే. 

 

 

 

 ఇప్పటికే దర్శకుడు హరీష్ శంకర్ ఎన్నో రీమేక్ సినిమాలు చేశాడు.మిరపకాయ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ లాంటి సొంత కథలతో హిట్టు సాధించిన  కూడా గబ్బర్ సింగ్ గద్దలకొండ గణేష్ లాంటి సినిమాలు కూడా విజయం సాధించడంతో దర్శకుడు హరీష్ శంకర్ పై రీమేక్  దర్శకుడు అంటూ ముద్రపడిపోయింది. దీంతో దాన్ని సరి చేసుకునే పనిలో పడ్డారట దర్శకుడు హరీష్ శంకర్. సొంత టాలెంట్  నిరూపించుకోవాలని పవన్ సినిమాకు హరీష్ శంకర్ నో  చెప్పినట్లు తెలుస్తోంది. దర్శకుడు హరీష్ శంకర్ పవన్ సినిమాకు నో చెప్పిన తర్వాతే నిర్మాతలు శ్రీరామ దర్శకుడుగా ఎంచుకున్నారు అని ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా ఇప్పటివరకు పింక్ రీమేక్ పై  వాళ్లు వీళ్లు స్పందించడం తప్ప పవన్ కళ్యాణ్ మాత్రం స్పందించలేదు. అంతేకాకుండా తాజాగా  మీడియా సమావేశం నిర్వహించిన పవన్ కళ్యాణ్ సినిమాలు నిర్మిస్తానని సినిమాలో నటించడం గురుంచి ఇప్పటివరకు ఆలోచన చేయలేదు అని తెలపడం కూడా ప్రస్తుతం పవన్ అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: