టాలీవుడ్ బ్యూటి ఫుల్ హీరోయిన్ రకుల్‌ ప్రీత్ సింగ్ కి తెలుగులో రీసెంట్‌గా నటించిన అక్కినేని నాగార్జున  'మన్మథుడు 2' భారీ డిజాస్టర్. ఈ సినిమాకి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించాడు. ఇక బాలీవుడ్‌లో అజయ్ దేవగన్ సరసన ఈ హీరోయిన్ హాట్ హాట్ అందాలతో రెచ్చిపోయి నటించినప్పటికి అది అంతగా క్లిక్ అవలేదు. అయినా కూడా రకుల్ కి బాలీవుడ్ ఇండస్ట్రీ మీద ఆశ అలాగే ఉంది. ఎలాగూ టాలీవుడ్‌లో ఖాళీగానే ఉంటున్నా కదా.. అందుకే బాలీవుడ్‌లో ఎలాంటి అవకాశం వచ్చినా పర్లేదు అనుకున్నట్టుగా ఉంది బక్క బ్యూటీ వ్యవహారం. తాజాగా రకుల్ నటించిన 'మర్జావన్' సినిమా బాలీవుడ్‌లో విడుదలై నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. 

రకుల్ ది ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ పాత్ర కాదు. అయినా ఈ సినిమాలో వేశ్య పాత్రలో బోల్డ్ గా నటించింది. ఈ బోల్డ్ క్యారెక్టర్ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ ఈ క్యారెక్టర్ రకుల్ కి ఏమాత్రం హెల్ప్ అవలేకపోయింది. ఈ మర్జావన్ సినిమా కోసం రకుల్ బాలీవుడ్‌లో చేసిన ప్రమోషన్స్ అన్నీ ఇన్నీ కావు. అయితే రకుల్ చేసిన ఆ ప్రమోషన్స్‌కి సినిమాకి హిట్ టాక్ పడితే బావుండేది. ఇక సినిమాలో రకుల్ చేసిన వేశ్య పాత్రని, సినిమాని కలిపి బాలీవుడ్ క్రిటిక్స్ చీల్చి చెండాడుతున్నారు. సిద్ధార్థ్‌ మల్హోత్రా, రితేష్‌ దేశ్‌ముఖ్‌ లాంటి ఫేమస్ హీరోలు నటించిన సినిమా అయినా.. సినిమా టాక్ బట్టి కలెక్షన్స్ ఉంటాయి. 

అసలు సినిమాలో విషయం లేకపోతే అందాల ఆరబోసినా వేస్ట్ అని ఇప్పటికే రకుల్ ప్రీత్ కి బాగా అర్థమైంది. అయినా అమ్మడుకి ఏదో మూల ఓ ఆశ. అందుకే ఇంకా బాలీవుడ్ అవకాశాల కోసం జీరో సైజ్‌లోకి మారిపోయి మరీ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. కానీ అక్కడ బాలీవుడ్ కూడా ఎప్పటికప్పుడు షాకిస్తూనే ఉంది. మరి తెలుగులో ఎంత త్వరగా ఫేడవుట్ అయ్యిందో.. బాలీవుడ్‌లోను ఈ బ్యూటీకి అదే పరిస్థితి వచ్చేలా కనబడుతుంది. ఒకప్పుడు తెలుగు, తమిళంలో వరుసగా స్టార్ హీరోల సరసన నటించి హిట్స్ అందుకుంది. అలాంటి రకుల్ కొన్నాళ్ళుగా హిట్ కోసం పడిగాపులు కాస్తుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: