సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస విజయాలతో టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాడు. భరత్ అనే నేను. మహర్షి వంటి సూపర్ హిట్ సినిమాలు చేసి మంచి జోష్ మీద ఉన్న మహేష్ బాబు ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వం లో 'సరిలేరు నీకెవ్వరు' అనే సినిమా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై అంచనాలు విపరీతంగా పెట్టుకున్నారు మహేష్ అభిమానులు. ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని కోరుకుంటున్నారు. ఇదిలా ఉండగా సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయాలని భావిస్తున్న క్రమంలో ఈ సినిమా విడుదల కాకముందే.. సినిమా స్టోరీ లీకైనటు సోషల్ మీడియాలో వార్తలు వినపడుతున్నాయి.


సోషల్ మీడియా లో విడుదలైన స్టోరీ బట్టి చూస్తే సినిమా స్టార్టింగ్ లోనే మహేష్ మిలట్రీ ట్రైనింగ్ తో మొదలవుతుందని ఆ తర్వాత ట్రైన్ జర్నీ లో హీరోయిన్ కలుసుకోవడం జరుగుతుందని ఆ ట్రైన్ జర్నీ లో కామెడీ ఎపిసోడ్ ఎక్కువగా ఉంటుందని సినిమాకి అదే హైలెట్ అవుతుందని..ముఖ్యంగా కమెడియన్ బండ్ల గణేష్ మరియు కొంతమంది జబర్దస్త్ కామెడీ షో కి సంబంధించిన నటీనటులతో డైరెక్టర్ అనిల్ రావిపూడి కామెడీ సీన్లు సినిమాకే హైలెట్ అని...అలాగే మహేష్ కర్నూల్ లో దిగాక అక్కడ పొలిటియన్ అయినటువంటి విజయశాంతితో కొన్ని రాజకీయ సమస్యల్లో జోక్యం చేసుకోవాల్సి వస్తుందని వాటిని హీరో ఎలా ఎదుర్కొని పరిష్కారం చూపించాడు అన్నదే అసలు కథ అని..ఒక పోస్ట్ వైరల్ అవుతుంది.


దీంతో మహేష్ అభిమానులు సినిమా హిట్ అవడం గ్యారెంటీ అని...స్టోరీ పరంగా చూసుకుంటే మహేష్ బాబుకి సినిమాలో అదిరిపోయే పంచ్ డైలాగులు అనిల్ రావిపూడి రాసినట్లు అర్థమవుతుందని...సంక్రాంతికి కచ్చితంగా మహేష్ బాబు ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టడం గ్యారెంటీ అంటూ కామెంట్లు చేస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: