వరుస విజయాలతో మంచి జోరుమీద ఉన్నాడు మహేష్ బాబు. ఇప్పటికే చేసిన రెండు సినిమాలు వరుసగా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో  ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వం లో చేస్తున్న 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో హ్యాట్రిక్ విజయం సాధించాలని తెగ తాపత్రయపడుతున్నారు మహేష్. సరిలేరు నీకెవ్వరు సినిమాలో మహేష్ పక్కన హీరోయిన్ గా  రష్మిక మందన నటిస్తోంది. అంతేకాకుండా ఈ సినిమాతో లేడీ అమితాబ్ బచ్చన్ విజయశాంతి రీ ఎంట్రీ ఇస్తోంది.


సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల కాబోతున్న ఈ సినిమా తరువాత మహేష్ బాబు దాదాపు మూడు నెలలు బ్రేక్ ఇవ్వనున్నట్లు సమాచారం. అయితే ఆ తర్వాత సమ్మర్ మొత్తం కుటుంబం తో ఎంజాయ్ చేసిన తర్వాత..మహేష్ బాబు, కెజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ఒక సినిమా చేయబోతున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే అది నిజమేనని, కాకపోతే వారిద్దరి కాంబోలో రాబోయే సినిమా ఎప్పుడు మొదలవుతుంది అనే దానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉందని మహేష్ సన్నిహితులు కొందరు చెప్పినట్లు టాక్.


ఇప్పటికే మహేష్ కోసం పాన్ ఇండియా కథాంశంతో కూడిన భారీ యాక్షన్ మూవీ స్టోరీ ని సిద్ధం చేసిన ప్రశాంత్ నీల్, ఈ సినిమా కోసం పలువురు బాలీవుడ్, కోలీవుడ్ నటులను కూడా తీసుకునేందుకు సిద్ధం అవుతున్నారట. అయితే ఈ సినిమాకి సంబంధించిన  కథా చర్చల దశలో ఉన్న నేపథ్యంలో ఒకవేళ సినిమా అంతా ఓకే అయితే సినిమా హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ ని తీసుకోవాలని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. గతంలో రకుల్ ప్రీత్ సింగ్ 'స్పైడర్' సినిమా లో మహేష్ పక్కన నటించడం జరిగింది. అయితే ప్రశాంత్ నీల్ తో సినిమా ఓకే అయితే మహేష్.. రకుల్ ప్రీత్ సింగ్ రెండోసారి జత కట్టినట్లు అవుతోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: