పవన్ కల్యాణ్ త్వరలో ఓ కొత్త చిత్రం ప్రారంభించబోతున్నారని కొన్నాళ్లుగా కథనాలు వస్తున్నాయి. హిందీ సినిమా పింక్‌ రీమేక్‌లో ప‌వ‌న్ న‌టిస్తార‌ని కొన్నిరోజులుగా ప్రచారం జరుగుతోంది. దాన్ని ప‌వ‌న్ కూడా తోసిపుచ్చలేదు. కాబట్టి త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పట్టాలు ఎక్కుతుందని ఫ్యాన్స్ కూడా ఆనందంలో ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి ఓ షాకింగ్ అప్ డేట్ తెలుస్తోంది.


ఇది కాస్త పవన్ ఫ్యాన్స్ ను డిజప్పాయింట్ చేసే అవకాశం ఉంది. అదేంటంటే పింక్ సినిమా రీమేక్ గురించి పవన్ ఆసక్తిగానే ఉన్నా.. ఈ సినిమా ఇప్పట్లో ప్రారంభమయ్యే ఛాన్సే కనిపించడం లేదట. 2020 జ‌న‌వ‌రి వ‌ర‌కూ ప‌వ‌న్ సినిమాల‌పై నిర్ణయాన్ని ప్రకటించే అవ‌కాశాల్లేవ‌ని ఆయన స‌న్నిహిత వ‌ర్గాలు చెబుతున్న సమాచారం.


ఎందుకంటే.. ఇప్పుడు పవన్ కల్యాణ్ ఏపీ రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ప్రజాసమస్యలపై పోరాటం చేస్తున్నారు. దీనికి తోడు త్వరలో ఏపీలో పంచాయ‌తీ ఎన్నిక‌లు రాబోతున్నాయి. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయంతో శ్రేణులు బాగా డీలా పడి ఉన్నాయి. కనీసం ఈ ఎన్నికల్లోనైనా కాస్త పరువు నిలుపుకునే ప్రయత్నం చేయకపోతే.. ఆ తర్వాత భవిష్యత్ బావుండదని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది.


జనసేన ఒక రాజకీయ పార్టీగా ఇప్పటి వరకూ సత్తా చాటుకున్నది లేదు. కేవలం ఒకే ఒక్క ఎమ్మెల్యే ఆ పార్టీకి ఉన్నాడు. జనంలో సత్తా నిరూపించుకోకుండా ఎన్ని యాత్రలు చేసినా.. ఎన్ని పోరాటాలు చేసినా పెద్దగా గుర్తింపు రాదు. అందుకే .. ఇంత కీల‌మైన స‌మ‌యంలో సినిమా మొద‌లెడితే ఫ‌లితాలు తేడాగా వ‌చ్చే ప్రమాదం ఉంద‌ని ప‌వ‌న్ భావిస్తున్నారు. అందుకే ఆయన ప్రస్తుతానికి సీరియస్ గా రాజకీయాలపైనే దృష్టి పెడుతున్నట్తు తెలుస్తోంది. అయితే నిర్మాతలను నిరుత్సాహపరచకుండా... మీరు మీరు క‌థ‌లు సిద్ధం చేసుకోండి.. ఎప్పుడు కావాలంటే అప్పుడు మొద‌లెడ‌దాం అని చెబుతున్నట్తు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: