స్టైలిష్ స్టార్
అల్లు అర్జున్ హీరోగా పూజ హెగ్డే
హీరోయిన్ గా తెరకెక్కుతున్న తాజా
సినిమా అలవైకుంఠపురములో షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతోంది.
సంక్రాంతి కానుకగా
జనవరి 12న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై బన్నీ ఫ్యాన్స్ లో భారీ స్థాయిలో అంచనాలు నెలకొని ఉన్నాయి.
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను
గీతా ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ సంస్థలు ఎంతో భారీగా నిర్మిస్తున్నాయి.
అయితే గతంలో బన్నీ మరియు
త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన
జులాయి,
సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలు మంచి
సక్సెస్ సాధించి ఉండడంతో, తప్పకుండా వారిద్దరి కాంబోలో రాబోతున్న ఈ సినిమా హ్యాట్రిక్ కొట్టడం ఖాయం అంటున్నారు. ఇక ఈ సినిమాలో సీనియర్ నటి టబు ఒక కీలక పాత్రలో నటిస్తుండగా
మురళి శర్మ, అక్కినేని
సుశాంత్,
నివేత పేతురాజ్,
సునీల్,
రాహుల్ రామకృష్ణ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాలో విలన్ గా
యువ నటుడు
నవదీప్ నటిస్తున్నట్లు టాక్. నిజానికి సినిమాలో బన్నీకి మంచి మిత్రుడిగా కనిపించే
నవదీప్,
సినిమా చివరిలో అసలు విలన్ గా తేలుతాడని అంటున్నారు. గతంలో బన్నీతో కలిసి
ఆర్య 2 సినిమాలో నటించి మెప్పించిన
నవదీప్, ఇటీవల కాలంలో పెద్దగా అవకాశాలు లేక కెరీర్ పరంగా కొంత సతమతం అవుతున్నాడు. కాగా ప్రస్తుతం అతడు నటిస్తున్న ఈ రోల్ తప్పకుండా అతడికి కేరీర్ లో మంచి గుర్తింపుని ఇవ్వడం ఖాయమని టాక్. కాగా ప్రస్తుతం పలు
మీడియా మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతున్న ఈ వార్తపై నిజానిజాలు తేలాలంటే మాత్రం మరికొద్దిరోజులు ఓపిక పట్టాల్సిందే. మంచి కమర్షియల్ హంగులతో ఆకట్టుకునే ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా సాగనున్న ఈ
సినిమా ఎంత మేర
సక్సెస్ సాధిస్తుందో చూడాలి....!!