మెగాస్టార్ చిరంజీవి రెండో కుమార్తె శ్రీజ
భర్త కళ్యాణ్ దేవ్ ఈ మద్యే
విజేత మూవీ తో సినిమాల్లోకి ఎంటర్ అయ్యాడు.
సినిమా హిట్ అవ్వకపోయిన కూడా ఎదో ఆలా రాంచి నెట్టుకొచ్చిన విషయం తెలిసిందే. మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన ఎవరినైనా జనాలు ఆదరిస్తారని చాలా మంది అనుకున్నారు కానీ, ఇక్కడ కాస్త రివర్స్ అయిందనే చెప్పాలి.
విజేత సినిమా అనుకున్న విదంగా రాకపోవడంతో ఇప్పుడు
సూపర్ మచ్చి సినిమాలో నటిస్తున్నారు.
పులి వాసు దర్శకత్వంలో 'సూపర్ మచ్చి' చిత్రంను రిజ్వాన్ ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ ఇటీవలే సినిమాను అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఈ
సినిమా ప్రారంభం అయ్యి కొన్ని వారాలు అయ్యిందో లేదో అప్పుడే ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆగిందనే టాక్ వినపడుతుంది. నిర్మాణ సంస్థ ఇటీవల నిర్మించిన రెండు సినిమాలు ఆర్థికంగా నష్టాలను మిగిల్చాయని.. అందుకే ఈ చిత్రంకు పెట్టుబడి పెట్టడంలో
నిర్మాత ఇబ్బంది పడుతున్నట్లుగా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.
ఫస్ట్
సినిమా రిలీజ్ అయినా కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టడంతో ఇప్పుడు ఈ
సినిమా చేస్తున్నాడు. అయితే
సినిమా అషూటింగ్ మొదలైనప్పటి నుండి ఇప్పటి వరకు
సినిమా పై ఏదొక వార్త అడ్డుగా నిలుస్తుంది. ఎదో అలా సాగుతుందిలా అనుకున్నప్పటికీ ఈ
సినిమా వాయిదా పడుతుందనే వార్తలు అప్పుడప్పుడు గుప్పుమన్నాయి. మెగా ఫ్యామిలీ నుండి ఎంట్రీ ఇచ్చిన
కళ్యాణ్ దేవ్ టైం బాగాలేని కారణంగా ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి అంటూ సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి.
ఇది ఇలా ఉండగా
సినిమా ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆగిపోవడంతో
మెగాస్టార్ చిరంజీవి స్వయంగా కొందరు ఫైనాన్షియర్స్ తో మాట్లాడి సదరు నిర్మాణ సంస్థకు ఫైనాన్స్ ఇప్పించినట్లుగా తెలుస్తోంది.
మెగాస్టార్ మాట సాయంతో మళ్లీ
సినిమా ప్రారంభం కాబోతుందట.
సినిమా మంచి కంటెంట్ తో తెరకెక్కిస్తే తప్పకుండా విడుదల సమయంలో హెల్ప్ చేస్తానంటూ
చిరంజీవి హామీ ఇచ్చాడట. కాగా ఈ విషయాన్నీ సీరియస్ తీసుకున్న చిత్ర బృందం ప్రస్తుతం సినిమాను శరవేగంతో షూటింగ్ జరిపిస్తున్నారు.