వరస పరాజయాలతో సతమతమైపోతున్న
సందీప్ కిషన్ ‘తెనాలి రామకృష్ణ’
మూవీ కూడ ఫెయిల్ అవ్వడంతో
సందీప్ కిషన్ ఫెయిల్యూర్ స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఇలాంటి పరిస్థితులలో ఈ ఫెయిల్యూర్
హీరో మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’
మూవీ టీమ్ కు దడ పుట్టించిన ఆసక్తికర సంఘటన లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చింది.
‘సరిలేరు నీకెవ్వరు’
మూవీ కథ చాల భాగం కర్నూల్ లో జరుగుతుంది. ఈ
మూవీ కోసం కర్నూల్ లోని కొండా బురుజు సెట్ ను హైదరబాద్ లో ప్రత్యేకంగా వేసి కొన్ని కీలక సన్నివేశాలు కొండా రెడ్డి బురుజు నేపధ్యంలో చిత్రీకరించారు. ఈ సెట్ కోసం సుమారు 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అన్న ప్రచారం కూడ ఉంది.
అయితే గత శుక్రువారం విడుదలైన ‘తెనాలి రామకృష్ణ’ మూవీలో కొండా రెడ్డి బురుజు ఒరిజినల్ షాట్స్ ఉన్నాయని ప్రచారం జరగడంతో ఖంగారు పడిపోయిన ‘సరిలేరు నీకెవ్వరు’
మూవీ టీమ్ అసలు విషయం తెలుసుకోవడం కోసం ‘తెనాలి రామకృష్ణ’ మూవీని మొదటిరోజు మొదటి షో
హైదరాబాద్ లో చూసినట్లు తెలుస్తోంది. అయితే ఈ
మూవీ దర్శకుడు నాగేశ్వర రెడ్డి ఆ కొండారెడ్డి బురుజు లొకేషన్ లో షూటింగ్ అయితే చేసాడు కానీ ఆ బురుజుని కథతో ఏ విధంగాను హైలెట్ చేయకపోవడంతో పాటు కేవలం ఒకటి రెండు సీన్స్ లో ఆ కొండారెడ్డి బురుజు అలా కనిపించి ఇలా మాయం అయిపోవడంతో ‘సరిలేరు నీకెవ్వరు’ టీమ్ ఊపిరి పీల్చుకున్నట్లు టాక్.
దీనికితోడు ‘తెనాలి రామకృష్ణ’ కి ఫ్లాప్ టాక్ వచ్చిన నేపధ్యంలో ఆ సినిమాకు వచ్చే ప్రేక్షకులే పెద్దగా కనిపించని పరిస్థితులలో ఆ కొండారెడ్డి బురుజు ‘సరిలేరు నీకెవ్వరు’ లో కనిపించినా ఎటువంటి ప్రమాదం లేదు అని గ్రహించి రిలాక్స్ అయినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ‘సరిలేరు నీకెవ్వరు’
మూవీ నిర్మాత అనీల్
సుంకర అయితే ‘తెనాలి రామకృష్ణ’ సినిమాలోని ఆ కొండారెడ్డి బురుజు సీన్ చూసే వరకు సరిగ్గా నిద్ర కూడ పోలేదని కొందరు జోక్ చేస్తున్నారు..