నాజూకు హీరోయిన్ రాశి ఇటీవల తన హీరోల గురించి మనసులో మాట బయటపెట్టింది. ఆమె తాను నటించిన సినిమాల్లో హీరోల గురించి కామెంట్ చేసింది. ఆమె ఫస్ట్ హీరో నాగ శౌర్య.. అతని గురించి చెబుతూ.. ‘ఊహలు గుసగుసలాడే’తో నేనూ, నాగశౌర్యా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాం. తను నా ఫస్ట్‌ హీరోగా ఎప్పుడూ బెస్ట్‌గా అనిపిస్తాడు. సెట్‌లో మేమిద్దరం చాలా త్వరగా ఫ్రెండ్స్‌ అయ్యాం అని చెప్పుకొచ్చింది.


తనకు స్ఫూర్తినిచ్చినవాళ్లలో శౌర్య ఒకడట. సినిమా బ్యాక్‌గ్రౌండు లేకుండా ఇండస్ట్రీలో నిలబడ్డాడు. ఐదేళ్లు కష్టపడి సినిమా అవకాశాలు సంపాదించాడు. షూటింగు గ్యాప్‌లో అవన్నీ చెప్పేవాడు. ఇంకా ఇంకా నేర్చుకోవాలని తపన పడేవాడు. నేను డైలాగులు ప్రాక్టీసు చేస్తుంటే సాయపడేవాడు. కొన్నిసార్లు మొహమాట పడి అడగకపోయినా అర్థం చేసుకుని తెలియనివి చెప్పేవాడు. కలుపుగోలు అబ్బాయి. చాలా సాదాసీదాగా ఉండటానికి ఇష్టపడతాడు. అంటూ తెగమెచ్చుకుంది.


అందాల రాశి ఎన్టీఆర్ సరసన జైలవకుశ సినిమాలో నటించింది. ఆ ముచ్చట్లు చెబుతూ.. తారక్‌కి నేను పెద్ద ఫ్యాన్‌ని అంటోంది. ‘జైలవకుశ’ చేసేప్పుడు మొదట్లో చాలా సీరియస్‌గా కనిపించేవాడట తారక్. మాట్లాడటానికి చాలా భయపడిందట. కానీ ఒక్కసారి పరిచయం అయ్యాక ఇంట్లో మనిషిలా చూస్తాడని తరవాత అర్థమైందంటోంది. ఆ సమయంలో తారక్‌ నుంచి నేను చాలా నేర్చుకుందట రాశి.


ఎక్స్‌ప్రెషన్స్‌, డాన్సుతోపాటు తెలుగు డైలాగ్సు స్పష్టంగా పలకడానికి చాలా తాపత్రయ పడతాడని చెప్పింది. తన పంక్చువాలిటీ నచ్చుతుంది. ‘నాకు వృత్తే దైవం, అదే శ్వాసగా పని చేస్తా. తోటి నటులూ అలానే ఉండాలనుకుంటా’ అని ఎప్పుడూ చెబుతుంటాడు తారక్‌... అంటూ ఆనాటి జ్ఞపకాలు నెమరువేసుకుంది. తారక్ మిస్టర్ పర్ ఫెక్ట్ అంటూ బిరుదు ఇచ్చేసింది. పెద్ద హీరోలను కాకాపడితే అవకాశాలు వస్తాయని కాదట. తనకు నిజంగానే ఎన్టీఆర్ మిస్టర్ పర్ ఫెక్ట్ అంటూ కితాబిస్తోంది అందాల రాశి.


మరింత సమాచారం తెలుసుకోండి: